మహేష్ మేనల్లుడితో సితార కొత్త మూవీ..!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ పక్క భారీ సినిమాలు చేస్తూనే మరోపక్క యువ హీరోలతో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.

Update: 2024-09-21 12:21 GMT

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ పక్క భారీ సినిమాలు చేస్తూనే మరోపక్క యువ హీరోలతో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. లేటెస్ట్ గా సితార బ్యానర్ నుంచి మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. సితార ఎంటరైన్మెంట్స్ 27వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా వస్తుంది. ఈ పూజా కార్యక్రమాలకు సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత ఘట్టమనేని అటెండ్ అయ్యారు.

నమ్రత ఫస్ట్ క్లాప్ కొట్టగా పద్మ గల్లా, మంజుల స్వరూప్ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు. సినిమా ఘన విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. గల్లా అశోక్ సరసన గౌరీ ప్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాత్మిక కూడా మరో జంటగా నటిస్తున్నారు.

యువ దర్శకుడు ఉద్భవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అమెరికా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఈ నెల ఆఖరికి సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్తుంది. సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని.. దానితో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామా కూడా ఉంటుందని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాకు భరధ్వాజ్ ఆర్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సం యుక్త బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటైల్స్ త్వరలో వెల్లడించనున్నారు. సితార బ్యానర్ నుంచి ఇప్పటికే డీజే టిల్లు, మ్యాడ్, టిల్లు స్క్వేర్ సినిమాలు రాగా వాటి తరహాలోనే ఈ సినిమా కూడా వాటి సరసన నిలుస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సితార బ్యానర్ నుంచి బాలకృష్ణ బాబీ కాంబో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే ఓ పక్క స్టార్స్ తో భారీ సినిమాలు చేస్తూనే మీడియం బడ్జెట్ తో కూడా సినిమాలు చేస్తున్నారు నాగ వంశీ .


Tags:    

Similar News