వైరల్‌ వీడియో : ఎన్టీఆర్‌ కి రక్తాభిషేకం

అరవింద సమేత తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ తో వచ్చిన ఎన్టీఆర్‌ మళ్లీ ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2024-09-24 06:43 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్‌ ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ఆరు ఏళ్ల తర్వాత వస్తుంది అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అరవింద సమేత తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ తో వచ్చిన ఎన్టీఆర్‌ మళ్లీ ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మల్టీస్టారర్ అవ్వడంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి ఎక్కువ హంగామా చేసే అవకాశం దక్కలేదు.

ఇప్పుడు దేవర సినిమాకు ఓ రేంజ్‌ హంగామాను నందమూరి ఫ్యాన్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ దేవర రిలీజ్ ను ఒక పండుగ మాదిరిగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. యూఎస్ లో విడుదలకు ముందే దేవర రెండు మిలియన్‌ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది అంటే ఏ స్థాయిలో సినిమా కి వసూళ్లు నమోదు కాబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది. ఈ మధ్య కాలంలో ఏ హీరో కి దక్కని వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ సినిమా దేవర కి నమోదు అవ్వబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు.

దేవర సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోపే ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హంగామా మొదలు పెట్టారు. పలు ప్రముఖ నగరాలు, పట్టణాలకు ఎన్టీఆర్‌ దేవర భారీ కటౌట్స్ వెళ్లి పోయాయి. సీడెడ్ లో ఎన్టీఆర్‌ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనంతపురంలోని ఒక థియేటర్‌ లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ చేసిన హంగామా తాలూకు వీడియో వైరల్‌ అవుతోంది. ఏకంగా 50 అడుగుల భారీ కటౌట్‌ ను ఏర్పాటు చేసిన ఫ్యాన్స్‌, ఆ కటౌట్‌ కి రక్తాభిషేకం, పాలాభిషేకం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఎన్టీఆర్‌ కు ఇలాంటి అభిషేకాలు కొత్తేం కాదు. అయితే ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్‌ సోలో హీరోగా మూవీ విడుదల అవుతున్న కారణంగా హడావుడి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. విడుదలకు ముందే ఈ స్థాయిలో క్రేజ్ ఉంటే, సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటే ఇంకెంత స్థాయిలో వసూళ్లు నమోదు చేయడం, రచ్చ జరగడం ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించగా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. కళ్యాణ్ రామ్‌ ఈ సినిమా ను మిక్కిలినేని సుధాకర్ తో కలిసి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించాడు. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర రూ.500 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో రిలీజ్ కి సిద్ధం అయింది.

Tags:    

Similar News