బాలయ్య, చిరు మల్టీస్టారర్.. బోయపాటి హైప్ పెంచేశారు!

సోలోగా అదరగొట్టే స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని సినీ ప్రియులు, ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉంటారు.

Update: 2024-10-19 05:50 GMT

మల్టీస్టారర్స్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. సోలోగా అదరగొట్టే స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని సినీ ప్రియులు, ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉంటారు. అయితే కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న విషయం తెలిసిందే. ఎంతమంది హీరోలు టాలీవుడ్‌ లోకి వచ్చినా.. ఎన్ని రికార్డులు సృష్టించినా.. చిరు, బాలయ్య క్రేజ్ ను మాత్రం మ్యాచ్ చేయలేరనే చెప్పాలి. అంతలా ఇద్దరూ కూడా ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నారు.

కానీ ఇప్పటి దాకా చిరు, బాలయ్య కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదనే వెలితి ఫ్యాన్స్‌ లో ఉండిపోయింది. గతంలో వీరిద్దరితో మల్టీస్టారర్ చేయాలని అనేక మంది మేకర్స్ ప్రయత్నించినా అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. సరైన కథ దొరక్కపోవడం అందుకు ఓ కారణం. కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్ వంటి దర్శకులు.. చిరు, బాలయ్యతో మల్టీస్టారర్ చేయాలని అనుకున్నా వర్కౌట్ కాలేదు. అన్నీ స్టోరీల డిస్కషన్ వద్దే ఆగిపోయాయి.

అయితే రీసెంట్ గా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిరంజీవి రావడంతో రెండు కుటుంబాల ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ సమయంలో చిరు మాట్లాడుతూ.. తాను బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అని తెలిపారు. వెంటనే నటసింహం కూడా డబుల్ రెడీ అన్నట్లు చెప్పారు. అక్కడే ఉన్న బోయపాటి శ్రీను సూచిస్తూ.. మీరు కథ రాస్తే తాము సిద్ధం అని ఇన్ డైరెక్ట్ గా అన్నారు చిరంజీవి!

అప్పటి నుంచి చిరు, బాలయ్య మల్టీస్టారర్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి కాకపోయినా.. సీనియర్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి.. ఆ మల్టీస్టారర్ ను తెరకెక్కిస్తారని జోరుగా ప్రచారం సాగింది. త్వరలో స్టార్ట్ కానున్న అన్ స్టాపబుల్ సీజన్-4 కు చిరు వస్తారని, అ సమయంలో బాలయ్యతో మల్టీస్టారర్ అనౌన్స్ చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఫ్యాక్ష‌న్ సినిమాల స్పెష‌లిస్ట్ బి.గోపాల్ కూడా క్రేజీ మల్టీస్టారర్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాక్ వచ్చింది.

అదే సమయంలో రీసెంట్ గా ఓ అవార్డుల వేడుకకు వచ్చిన బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు, బాలయ్య మల్టీస్టారర్ కోసం ప్రస్తావించగా.. వారిద్దరిని ఎదురుగా పెట్టుకుని కథ రాయకపోతే వేస్ట్ అని అన్నారు. వాళ్లే సినిమాకు టైటిల్ అంటూ క్రేజీగా మాట్లాడారు. దీంతో చిరు, బాలయ్య మల్టీస్టారర్ గురించి ఒక్కసారి మళ్లీ డిస్కషన్ స్టార్ట్ అయింది. బోయపాటినే ధర్శకత్వం చేయనున్నారని చెబుతున్నారు. త్వరలోనే సెన్సేషనల్ మూవీ అనౌన్స్మెంట్ రానున్నట్లు అర్థమవుతుందని, బోయపాటి హైప్ పెంచేశారని అంటున్నారు నెటిజన్లు. మరి వీటిలో నిజమెంత అనేది చూడాలి.

Tags:    

Similar News