మెగాస్టార్ `ఇంద్ర` రీరిలీజ్ సెన్సేష‌న్స్

ప్ర‌ముఖ హీరోలు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అభిమానుల కోసం 4కేలో రీమాస్ట‌ర్ చేసిన కొత్త వెర్ష‌న్ల‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-19 03:53 GMT

ప్ర‌ముఖ హీరోలు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అభిమానుల కోసం 4కేలో రీమాస్ట‌ర్ చేసిన కొత్త వెర్ష‌న్ల‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్లాసిక్ డే సినిమాల‌ను అప్ప‌టికే బుల్లితెర‌పై చాలా సార్లు వీక్షించినా కానీ, ఇప్పటికీ థియేట‌ర్ల‌కు వచ్చి చూసేందుకు ప్ర‌జ‌లు వెన‌కాడ‌టం లేదు. దీంతో కొత్త వెర్ష‌న్ల రీరిలీజ్ బంప‌ర్ హిట్లు కొడుతున్నాయి.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల రీమాస్ట‌ర్ వెర్ష‌న్లు రిలీజై హిట్లు కొట్టాయి. ఇప్పుడు బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర చిత్రం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రాన్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. మూవీ విడుద‌లై ఇప్పటికే 22 ఏళ్లు పూర్త‌యిన వేళ ఇంద్ర‌ను రిలీజ్ చేయ‌డం యాధృచ్ఛికం.

మ‌రోవైపు వైజయంతీ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్‌లో భాగంగా `ఇంద్ర` చిత్రాన్ని తిరిగి విడుదల చేస్తోంది. కల్కి 2898 ADకి లాంటి పాన్ ఇండియ‌న్ హిట్ ని అందుకున్న వైజ‌యంతి సంస్థ మెగాస్టార్ చిరంజీవితో మ‌ళ్లీ ప‌ని చేయాల‌ని భావిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇంద్ర చిత్రాన్ని రీరిలీజ్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. ఇంద్ర టిక్కెట్లు ఇప్ప‌టికే అమ్ముడ‌వుతున్నాయి. ఇప్పటికే చాలా లొకేషన్‌లలో హౌస్‌ఫుల్ బోర్డులతో సంచలనం సృష్టిస్తోంది. మిగిలిన షోలు వేగంగా నిండుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో పీక కోస్తా! అంటూ మెగాస్టార్ చెప్పే ఎమోష‌న‌ల్ డైలాగ్ ని అభిమానులు ఇంకా అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.

Tags:    

Similar News