అందాల 'యానిమల్‌' ఉక్కిరి బిక్కిరి..!

అంతకు ముందు అతి కొద్ది మందికి మాత్రమే వెబ్‌ సిరీస్ ద్వారా తెలిసిన ట్రిప్తి డిమ్రీ 'యానిమల్‌' తర్వాత పాన్‌ ఇండియా స్టార్ అయ్యింది

Update: 2024-07-11 11:30 GMT

తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ సినిమా యానిమల్‌ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రణబీర్ కపూర్‌ హీరోగా నటించగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించారు.

యానిమల్‌ సినిమాలో హీరోయిన్‌ అనగానే రష్మిక మందన్న పేరు గుర్తుకు వచ్చినా కూడా అంతకు మించి అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ట్రిప్తి డిమ్రీ. అంతకు ముందు అతి కొద్ది మందికి మాత్రమే వెబ్‌ సిరీస్ ద్వారా తెలిసిన ట్రిప్తి డిమ్రీ 'యానిమల్‌' తర్వాత పాన్‌ ఇండియా స్టార్ అయ్యింది.

యానిమల్‌ లో ఆమె చేసిన బోల్డ్‌ పాత్రకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా తో వచ్చిన గుర్తింపు కారణంగా ట్రిప్తి కి ఉక్కిరి బిక్కిరి అయ్యే స్థాయిలో ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. బాలీవుడ్ లో యంగ్‌ హీరోలు మొదలుకుని స్టార్‌ దర్శక నిర్మాతల వరకు అందరూ కూడా ఈమెకే తమ సినిమాలో హీరోయిన్ గా నటించాలని కోరుకుంటున్నారట.

ఇప్పటికే ట్రిప్తి డిమ్రీ చేతిలో దాదాపుగా ఆరు సినిమాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. తాజాగా ధనుష్ హీరోగా రూపొందబోతున్న తేరే ఇష్క్‌ మే సినిమాలో కూడా ట్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటించేందుకు కమిట్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

ధనుష్ హీరోగా ఆనంద్‌ ఎల్‌ రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో రాంఝనా సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వీరి తాజా మూవీ పై బాలీవుడ్‌ లో భారీ అంచనాలు ఉన్నాయి.

తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు తెలుగు మరియు హిందీల్లో డైరెక్ట్‌ సినిమాలు చేస్తున్న ధనుష్ ఇప్పుడు హిందీలో తేరే ఇష్క్‌ మే అనే మూవీ చేయబోతున్నాడు, ఈ సినిమా ను ఒక విషాద ప్రేమ కథతో రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ధనుష్ మరియు ట్రిప్తి డిమ్రి కాంబో కోసం అప్పుడే ప్రేక్షకుల వెయిటింగ్‌ షురూ అయ్యింది.

Tags:    

Similar News