నటి కారుకి యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

నటి గాయత్రి జోషి హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇటీవల గాయత్రి జోషి మరియు ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లు ఇటలీలో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది

Update: 2023-10-04 11:22 GMT

నటి గాయత్రి జోషి హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఇటీవల గాయత్రి జోషి మరియు ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ లు ఇటలీలో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు మరియు ఒక వ్యాన్‌ ఢీ కొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.


గాయత్రి జోషి మరియు ఆమె భర్త ప్రయాణిస్తున్న ఖరీదైన కారు మరియు మరో కారు ఒక వ్యాన్‌ ని ఓవర్‌ టేక్ చేసే క్రమంలో ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టాయి. వ్యాన్‌ బోల్తా పడింది. రెండు కార్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అయితే గాయత్రి దంపతులు గాయాలతో బయటపడ్డారు. కానీ మరో కారులో ఉన్న దంపతులు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యారు.

స్విట్జర్లాండ్‌ కి చెందిన మార్కస్ క్రౌట్లీ మరియు మెలిస్సా క్రౌట్లీ దంపతులు ప్రయాణిస్తున్న ఆ కారు కి మంటలు అంటుకోవడంతో వారు బయటకు రాలేక పోయారు. దాంతో వారు అగ్నికి ఆహుతి అయినట్లుగా స్థానిక మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ప్రమాద వార్తను గాయత్రి జోషి కూడా దృవీకరించారు. ఆమె తాము ఇద్దరం కూడా సేఫ్ గా ఉన్నామని పేర్కొన్నారు. పెద్ద ప్రమాదం జరిగినా కూడా అదృష్టం కొద్ది సేఫ్ గా ఉన్నామని పేర్కొంది. 2005 లో వికాస్ ఒబెరాయ్ ని వివాహం చేసుకున్న గాయత్రీ జోషి జీవితంలో ఇలాంటి సంఘటన జరగడం ఆమె సన్నిహితులకు ఆందోళన కలిగించింది. గాయాలతో బయట పడటం ఒకింత ఊరట కలిగించే విషయం.


Tags:    

Similar News