గుంటూరు కారం.. మరో రాగం ఎప్పుడు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఈ మధ్యనే మళ్లీ స్పీడ్ పెంచుకుంది

Update: 2023-12-05 10:12 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ఈ మధ్యనే మళ్లీ స్పీడ్ పెంచుకుంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ ప్లాన్ కు తగ్గట్టుగానే ఎక్కడ గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలి అని త్రివిక్రమ్ చాలా కసిగా వర్క్ చేస్తూ ఉన్నాడు.

ఎందుకంటే ఎన్నో ఇబ్బందుల మధ్యలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇక అన్ని సమస్యల నుంచి దాటిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే ధమ్ మసాలా ఒక సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తమన్ స్వరపరిచిన ఆ మాస్ పాట ఓవర్గం ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది.

ఇక నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే గతవారం లోనే ఈ సినిమా సెకండ్ సాంగ్ విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పాడు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో ఆ ప్లాన్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. బహుశా అనిమల్ సినిమా హడావిడి ఎక్కువగా ఉండడంతో వాయిదా వేసుకుని ఉండవచ్చు.

ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అయితే మిస్ కావొద్దు అని ఒక డేట్ పై క్లారిటీ ఇవ్వబోతున్నారు. వచ్చే వారంలో సెకండ్ సింగిల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాట మెలోడీగా ఉండబోతుందట. శ్రీల మహేష్ మధ్యలో ఉండబోయే ఆ పాట సినిమాలో చాలా హైలెట్ నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక సంగీత దర్శకుడు తమన్ మళ్లీ అల..వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తూ ఉండడంతో ఈ సినిమా మ్యూజిక్ పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

మొదటి పాట పరవాలేదు అనిపించినప్పటికీ ఊహించని రేంజ్ లో అయితే వైరల్ కాలేదు. ఇక రాబోయే పాటలు కూడా రెండు ట్రెండింగ్ అయ్యే పాటలే అని నాగవంశీ ఆమధ్య కాన్ఫిడెంట్గా తెలియజేశాడు. మరి ఆ స్థాయిలో పాటలు ఉంటాయో లేవో చూడాలి. ఇక ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి ఒక స్పెషల్ పాత్రలో కనిపించనుంది.

Tags:    

Similar News