వెంకటేష్ కంటే అనిల్ రెమ్యూనరేషన్ ఎక్కువా?

అంతలా అతడు వరుసగా విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ.. సక్సెస్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

Update: 2024-10-27 17:30 GMT

టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ల పేర్లు చెప్పమంటే ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి గురించే చెప్తారు. అంతలా అతడు వరుసగా విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ.. సక్సెస్‌నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలో ఎంతో మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అతడు.. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

‘పటాస్’ తర్వాత వరుసగా సినిమాలను సక్సెస్‌గా మలుచుకున్న అనిల్ రావిపూడి.. రీసెంట్‌గా నటసింహా నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ని తెరకెక్కించాడు. ఇది కూడా కమర్షియల్‌గా సక్సెస్ అయింది. దీంతో అతడి రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ జోష్‌లోనే అనిల్ రావిపూడి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును సైతం కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియకుండానే దీనికి సంబంధించి ఎన్నో రకాల అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం కోసం వెంకటేష్, అనిల్ రావిపూడి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న అంశం తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో హాట్ టాపిక్ అయిపోతోంది.

కొంత కాలంగా భారీ హిట్ కోసం ఎదురు చూస్తోన్న విక్టరీ వెంకటేష్ ఈ సినిమా కోసం రూ. 18 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారట. అయితే, అనిల్ రావిపూడి మాత్రం ఏకంగా 25 కోట్ల రూపాయలను చార్జ్ చేస్తున్నాడని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఈ సినిమా నుంచి వచ్చే లాభాల్లో సైతం అతడు వాటాను అందుకోనున్నాడని అంటున్నారు. మొత్తంగా వెంకీ కంటే అనిల్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ వర్గాలనే షాక్‌కు గురి చేస్తోంది.

ఇక, ఈ సినిమా పోలీస్ అధికారి స్టోరీతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో హీరో మాజీ ప్రేయసి, భార్య మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు.

Tags:    

Similar News