జానీకి బిగ్ షాక్.. పోక్సో యాక్ట్ కింద మరో కేసు!

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-09-18 11:36 GMT

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్.. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు అక్కడి పోలీసులు. ఇప్పుడు నార్సింగి పోలీసులు.. జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు పోలీసులనూ సంప్రదించినట్లు సమాచారం.

మరికొద్ది గంటల్లో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు సమాచారం. పలు మీడియా కథనాల ప్రకారం.. జానీపై పోక్సో యాక్ట్ కింద మరో కేసు నమోదు అయింది. ముంబై హోటల్ లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొందట. దీంతో పోక్సో యాక్ట్ ను కూడా పోలీసులు యాడ్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

అయితే ఈ కేసులో బాధితురాలికి నేడు వైద్యులు.. అన్ని పరీక్షలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేసినట్లు సమాచారం. సఖి, భరోసా బృందాలు వివిధ వివరాలు సేకరించినట్లు వినికిడి. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బాధితురాలి ఇంటికి వెళ్లనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతకుముందే.. జానీ మాస్టర్ ను పోలీసులు తమ అదుపులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 2017లో ఆమెకు జానీ మాస్టర్ కు పరిచయం అయ్యారు. అక్కడికి రెండేళ్లకు జానీ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరింది. ఆ తర్వాత ముంబైలో ఓ మూవీ షూటింగ్ కోసం జానీతో పాటు బాధితురాలు వెళ్లింది. వారితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. అప్పుడు జానీ మాస్టర్.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. బయట ఎవరికి చెప్పినా.. చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఆ తర్వాత తనపై పలు చోట్ల.. షూటింగ్ టైమ్స్ లో జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. షూటింగ్ జరుగుతున్న టైమ్ లో కూడా వ్యానిటీ వ్యాన్ లో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. అక్కడికి కొద్ది రోజుల తర్వాత వాటిని తట్టుకోలేక జానీ టీమ్ నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. కానీ తనకు అనేక  విషయాల్లో ఇబ్బందులు గురి చేశారని పేర్కొంది. దీంతో రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News