పిక్ టాక్ : దేవర కోసం తంగం అందాల షో

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే.

Update: 2024-09-10 08:01 GMT

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే. రికార్డ్‌ స్థాయి బడ్జెట్‌ తో నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా దర్శకుడు దేవర సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా ప్రమోషన్ లో జాన్వీ కపూర్ యాక్టివ్‌ గా కనిపిస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న జాన్వీ కపూర్‌ కి దేవర మొదటి కమర్షియల్‌ బ్రేక్‌ ను ఇవ్వబోతున్నట్లుగా ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

దేవర లో తంగం పాత్రలో జాన్వీ కపూర్‌ కనిపించబోతుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లో ఎన్టీఆర్‌ తో సమానంగా డాన్స్ చేస్తూ, అందాల ఆరబోత చేసిన జాన్వీ కపూర్‌ చూపు తిప్పుకోనివ్వలేదు. తాజాగా మరోసారి దేవర కోసం అంటూ తన అందాల ఫోటోలను షేర్‌ చేసింది. దేవర పాటల కోసం, సీన్స్ కోసం జాన్వీ కపూర్‌ అందమైన ఔట్‌ ఫిట్ తో కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇలా షేర్‌ చేసిన జాన్వీ కపూర్‌ నెట్టింట వైరల్‌ అయింది. సాధారణంగానే జాన్వీ కపూర్‌ ఫోటో షూట్స్ వైరల్‌ అవుతాయి.

ఈసారి దేవర సినిమాలోని స్టిల్స్ ను ఆమె షేర్ చేయడం ద్వారా చూపు తిప్పనివ్వడం లేదు. సాధారణంగా ఎన్టీఆర్‌ పక్కన ఏ హీరోయిన్‌ ఉన్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇమేజ్ ముందు పెద్ద హీరోయిన్స్ కూడా చిన్న పోతారు. అలాంటిది జాన్వీ కపూర్‌ మాత్రం తన అందంతో దృష్టి తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ స్థాయిలో అందం కేవలం జాన్వీ కపూర్ కే సాధ్యం అయిందంటూ నెట్టింట కామెంట్స్ వస్తున్నారు. ఆకట్టుకునే అందం తో జాన్వీ కపూర్ దేవర లో కనిపించనున్నట్లుగా ఈ ఫోటోలు షేర్ చేసింది.

ఎన్టీఆర్‌ గత చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా దేవర సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నేడు జాన్వీ కపూర్ తో కలిసి ముంబైలో జాతీయ మీడియా సమక్షంలో దేవర ట్రైలర్ ను ఎన్టీఆర్‌ రిలీజ్‌ చేయబోతున్నాడు. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్‌, శ్రీదేవిల జంట కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. ఇప్పుడు ఆయన మనవడు ఎన్టీఆర్‌, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబో లో సినిమా వస్తున్న నేపథ్యంలో అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాన్వీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న వారికి కచ్చితంగా విందు భోజనం మాదిరిగా గేమ్ ఛేంజర్‌ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News