ఈ సినిమాతో నాకు మెట్టినిల్లు దొరికింది

'ఏ మాస్టర్‌ పీస్‌' సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో దర్శకుడు సుకు పూర్వజ్‌ తో పరిచయం ఏర్పడటంతో పాటు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Update: 2024-06-08 05:30 GMT

గుప్పెడంత మనసు సీరియల్‌ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయిన కన్నడ ముద్దుగుమ్మ జ్యోతి రాయ్. ఈమధ్య కాలంలో వెబ్‌ సిరీస్‌ లో కూడా నటించిన ఈమె తాజాగా తెలుగు లో సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో రూపొందిన 'ఏ మాస్టర్ పీస్‌' సినిమాలో నటించింది.

హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో మొదటి సారి నటించిన జ్యోతి రాయ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఏ మాస్టర్‌ పీస్‌' సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్న సమయంలో దర్శకుడు సుకు పూర్వజ్‌ తో పరిచయం ఏర్పడటంతో పాటు ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ వెంటనే ఇద్దరి వివాహం కూడా జరిగింది.

తాజాగా జ్యోతి రాయ్ మీడియా తో మాట్లాడుతూ... ఏ మాస్టర్ పీస్ నా జీవితంలో చాలా కీలకమైనది. హీరోయిన్ గా నాకు టాలీవుడ్‌ లో అవకాశం దక్కడంతో పాటు, ఈ సినిమాతో నాకు టాలీవుడ్‌ మెట్టినిల్లు అయ్యింది. ముందు ముందు నేను టాలీవుడ్‌ లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశ పడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

లేటు వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ నటి కి ఉన్న గుర్తింపు నేపథ్యంలో ముందు ముందు టాలీవుడ్‌ లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఆసక్తి చూపించాలే కానీ ఐటెం సాంగ్ లో కూడా నటించే అవకాశాలు వస్తాయి అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏ మాస్టర్ పీస్ సినిమాలో హీరోగా అరవింద్‌ కృష్ణ నటించగా అషురెడ్డి మరియు స్నేహ గుప్తా లు హీరోయిన్స్ గా నటించారు. ఇటీవలే విడుదల అయిన టీజర్‌ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దర్శకుడు సుకు పూర్వజ్ పూరాణాల కాన్సెప్ట్‌ ను తీసుకుని సూపర్ పవర్‌ ఉన్న హీరోను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాతో నటిగా జ్యోతి రాయ్ కి మంచి స్టార్‌డం దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News