పెద్ద ద‌ర్శ‌కుడు ఓటీటీలోకి వ‌స్తూ సెన్సేష‌న్స్

ఫిబ్రవరి 2025లో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Update: 2024-10-25 03:45 GMT

పెద్ద తెర‌కు ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు ఓటీటీ రంగంలో ప్ర‌వేశిస్తున్నారు. అత‌డు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించే ఓటీటీ సిరీస్ కోసం అత‌డు ఎంపిక చేసుకున్న నేప‌థ్యం.. క‌థాంశం ఉత్కంఠ క‌లిగిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ కు `జెట్ సెట్ గో` అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2025లో ఈ వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ముగ్గురు క‌థానాయిక‌లు న‌టిస్తారు. క‌రణ్ మార్క్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా ఉంటుందని స‌మాచారం.


జెట్ సెట్ గో 2025 లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని, 2026లో నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌ల‌వుతుంది. కరణ్ జోహార్ ఈ కొత్త ప్రాజెక్టును ప్ర‌క‌టించ‌గానే అంద‌రి నుంచి సానుకూల స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. చాలా మంది అభిమానులు విమానయాన నేపథ్యంలో సినిమా తీయ‌డం ఎగ్జ‌యిట్ చేస్తోంద‌ని అన్నారు. అయితే క‌ర‌ణ్ మొద‌టిసారి ఒక ఓటీటీ సినిమాను తీస్తుండ‌డంతో దిగువ స్థాయిలో మాస్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ప‌ని చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

ఓటీటీ సిరీస్ లో ముగ్గురు నాయిక‌లు ఉండాల‌నుకోవ‌డం క‌ర‌ణ్ గ‌త సినిమాల‌ను గుర్తు చేస్తోంది. అయితే పెద్ద తెర‌తో పోలిస్తే ఓటీటీ తెర త‌నకు పూర్తిగా కొత్త‌. అందువ‌ల్ల ఇక్క‌డ కూడా అత‌డు అనుకున్న‌ది సాధిస్తాడా లేదా? అన్న‌ది వేచి చూడాలి. క‌ర‌ణ్ కి చెందిన ధ‌ర్మ‌ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీలో 50శాతం వాటాను ప్ర‌ముఖ బిజినెస్ మేన్ సొంతం చేసుకున్నార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News