ఆయ‌న వ‌ల్లే బోల్డ్ స‌న్నివేశాల్లో సౌక‌ర్య‌వంతంగా!

ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా మ‌ల్లికా షెరావ‌త్ బోల్డ్ స‌న్నివేశాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Update: 2024-10-11 11:30 GMT

బాలీవుడ్ హాట్ సంచ‌ల‌నం మ‌ల్లికాషెరావ‌త్ పేరు చాలా కాలానికి మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఏడేళ్ల క్రితం వ‌ర‌కూ యాక్టివ్ గా ఉన్న అమ్మ‌డు అటుపై పెద్ద‌గా క‌నిపించ‌లేదు. 2022లో మాత్రం ఓ సినిమా తో ప్రేక్ష‌కుల ముందు కొచ్చింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ రెండేళ్ల గ్యాప్ అనంత‌రం ` విక్కీ విద్యా కా వాలా వీడియో` చిత్రంతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా మ‌ల్లికా షెరావ‌త్ బోల్డ్ స‌న్నివేశాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.


`కెరీర్ ఆరంభంలోనే గొప్ప వ్య‌క్తుల్ని క‌లిసా. వారి వ‌ల్లే న‌న్ను నేరు మార్చుకోగ‌లిగాను. మ‌హ‌ష్ భ‌ట్ నాకు రెక్క‌లు ఇచ్చారు. ఆయ‌న సెట్స్ లో అమ్మాయిల‌కు ఎంతో ర‌క్ష‌ణ ఉంటుంది. ఆయ‌న నిర్మించిన మ‌ర్డ‌ర్ చిత్రంలో నాపై ఎన్నో బోల్డ్ స‌న్నివేశాలు తీసారు. సెట్ లో ఎంతో మంది ఉంటారు. వాళ్ల మ‌ధ్య‌లో అలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌డం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అది స‌హ‌జం. కానీ న‌టీన‌టులు ఏమాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేలా మ‌హేష్ భ‌ట్ సెట్ లో వాతావార‌ణ‌న్ని క‌ల్పించేవారు.

అందువ‌ల్ల బోల్డ్ స‌న్నివేశాల్లో సౌక‌ర్య‌వంతంగా న‌టించ‌గ‌లిగాను. న‌టీమ‌ణుల సౌక‌ర్యం ఆలోచించే నిర్మాత‌లు ఉంటే సెట్ లో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు` అని అంది. `మ‌ర్డ‌ర్` సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీకి జోడీగా మ‌ల్లికా షెరావ‌త్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో తెర‌కెక్కిన సినిమా అప్ప‌ట్లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది.

50 మిలి య‌న్ల బ‌డ్జెట్తో నిర్మించిన చిత్రం 250 మిలియ‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇద్ద‌రి మ‌ధ్య ఇంటిమేట్ స‌న్నివేశాలు అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. హిందీ సినిమా అయినా సౌత్ లోనూ ఎంతో ఫేమ‌స్ అయిన చిత్రంగా నిలిచింది. ఈసినిమాతోనే ఇమ్రాన్ హ‌ష్మీకి సీరియ‌స్ కిస్స‌ర్ గా పేరొచ్చింది. కెరీర్ లో అత‌డి రెండ‌వ చిత్రం కాగా, మ‌ల్లికా షెరావ‌త్ కు నాల్గ‌వ చిత్రం.

Tags:    

Similar News