రాజ్ తరుణ్ వివాదం.. రంగంలోకి దిగిన హీరోయిన్!

ఇదిలా ఉంటే తాజాగా మాల్వీ మల్హోత్రా లావణ్య ఆరోపణలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు తిరిగి ఆమెపై పోలీసులకి ఫిర్యాదు చేసింది.

Update: 2024-07-07 06:05 GMT

రాజ్ తరుణ్ పై అతని ప్రియురాలు లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రాజ్ తరుణ్ కి జోడీగా తిరగబడర సామి సినిమాలో హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రాపై సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాతో అఫైర్ పెట్టుకొని తనని వదిలించుకోవాలని అనుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడు తనని చంపేస్తానని బెదిరిస్తున్నారని లావణ్య ఆరోపించింది. వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని పేర్కొంది.

ఇదిలా ఉంటే తాజాగా మాల్వీ మల్హోత్రా లావణ్య ఆరోపణలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు తిరిగి ఆమెపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. డీసీపీని కలిసి లావణ్యపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. రాజ్ తరుణ్ నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమేనని, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని మాల్వీ మీడియాకి తెలియజేసింది. లావణ్య ముఖం కూడా నేను ఇంత వరకు చూడలేదనే, రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం గురించి నాకు ఎలాంటి విషయాలు తెలియవని మాల్వీ పేర్కొంది.

నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం లావణ్య చేసిందని మాల్వీ తెలిపింది. ఈ కారణంగా ఆమె మీద పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగిందని మాల్వీ క్లారిటీ ఇచ్చింది. నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్ కి లావణ్య ఫోన్ చేసి బెదిరింపులకి పాల్పడుతుందని మాల్వీ చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ కి జోడీగా నేను కొత్త సినిమాలో చేస్తున్నాను. అంత వరకే మా ఇద్దరి రిలేషన్ అని మాల్వీ క్లారిటీ ఇచ్చింది.

లావణ్య షేర్ చేసిన ఆడియో రికార్డ్స్ లో కూడా రాజ్ తరుణ్ తో నేను రిలేషన్ షిప్ లో లేననే విషయాన్ని చెప్పానని మాల్వీ తెలిపింది. రాజ్ తరుణ్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ బ్లాక్ చేయమని చెప్పడంతోనే నేను చేసాను. అయిన మా నాన్న నెంబర్ కి ఫోన్ చేసి బెదిరించింది. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఆమె ఎలా ట్రాక్ చేస్తుంది.. ఆమె చేసిన పని వలన నా ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. వీటన్నింటికి ఆమె సమాధానాలు చెప్పి తీరాలి అని మాల్వీ మల్హోత్రా మీడియాతో తెలిపింది.

నా మీద లావణ్య వ్యక్తిగతంగా, నా ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా చేసిన ఆరోపణలపై, అలాగే ఆమె బెదిరింపులపై కంప్లైంట్ చేసినట్లు మాల్వీ తెలియజేసింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె తిరిగి పోలీసులకి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని తెలుస్తోంది. ఈ ఇష్యూపై రాజ్ తరుణ్ కూడా లీగల్ గా వెళ్లాలని అనుకుంటున్నాడు. మరి ఈ ఇష్యూ ఏ స్థాయి వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Full View


Tags:    

Similar News