బిగ్ బాస్ 8 : కింగ్ నాగార్జున బచ్చా కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో శని, ఆదివారాల ఎపిసోడ్స్ ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేస్తున్నాయి.

Update: 2024-10-13 03:29 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో శని, ఆదివారాల ఎపిసోడ్స్ ఆడియన్స్ ని మరింత ఎంటర్టైన్ చేస్తున్నాయి. సీజన్ 8 లో హోస్ట్ నాగార్జున తన ఎనర్జిటిక్ యాంకరింగ్ తో అలరిస్తున్నారు. లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి రాగా వారితో పాటు ఆల్రెడీ హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ ఈ రెండు క్లాన్స్ మధ్య ఈ వారం ఆట రసవత్తరంగా మారింది. ఇక నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ ఫైనల్ గా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు.

శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మెట్స్ లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ ని బట్టి రైసింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్ గా డివైడ్ చేశారు. హౌస్ లో వారు ఆడుతున్న ఆట తీరుని బట్టి రైసింగ్ ఎవరు, ఫాలింగ్ ఎవరన్నది వెల్లడించారు. లాస్ట్ వీక్ మెగా చీఫ్ గా ఉన్న నబీల్ ఫాలింగ్ స్టార్ బోర్డ్ లో పెట్టి రాయల్ క్లాన్ వచ్చాక నీ ఆట నువ్వు మర్చిపోయావని నబీల్ కి నాగార్జున చెప్పారు.

ఇక మరోపక్క కొత్త మెగా చీఫ్ మెహబూబ్ ని ప్రశంసిస్తూ అతన్ని అరుంధతి నీకు పెళ్లా అంటూ ఏడుస్తూ చెప్పాలని చెప్పడంతో అతను చేసి అలరించాడు. ఇక రోహిణిని నిలబెట్టి మణికంఠ నీకు బచ్చాలా అనిపిస్తున్నాడా అని ప్రశ్న లేవనెత్తారు. తాము సీనియర్స్ అన్న ఆలోచన ఉందా అంటూ నాగార్జున రోహిణిని అడిగారు. ఐతే ఆటలో సరదాగా అన్నానని రోహిణి చెప్పుకొచ్చింది. మణికంఠకి రోహిణి మీద ఇంకాస్త డౌట్ పెరిగేలా చేశారు నాగార్జున.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో సీత ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో సీత ఎలిమినేషన్ జరుగుతుంది. హౌస్ లో తన ఆటతో ఆకట్టుకున్న సీత ఈ రెండు వారాల నుంచి కాస్త డల్ గా కనిపిస్తుంది. ఐతే సీతతో పాటు నామినేషన్స్ లో ఉన్న మెహబూబ్ కూడా చివరి దాకా ఉంచి సస్పెన్స్ లో ఉన్నాడు. మెహబూబ్ ఈ వారం మెగా చీఫ్ అయిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News