ర‌హ‌స్య ప్ర‌దేశంలో జానీ మాస్ట‌ర్ విచార‌ణ‌!

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అత్యాచారం చేసాడ‌నే ఆరోప‌ణ‌ కేసులో తెలంగాణ పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైద‌రాబాద్ కి త‌రలించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-20 06:12 GMT

కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ అత్యాచారం చేసాడ‌నే ఆరోప‌ణ‌ కేసులో తెలంగాణ పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైద‌రాబాద్ కి త‌రలించిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు అత‌డిని ఓర‌హ‌స్య ప్ర‌దేశంలో విచారి స్తున్నారు. హైద‌రాబాద్ శివార్ల‌లోని ఓ ఫామ్ హౌస్ లో విచారిస్తున్న‌ట్లు వార్తలొస్తున్నాయి. ఈ విచార‌ణ అనంత‌రం అత‌న్ని ఫోక్సో కోర్టు న్యాయ‌మూర్తి ముందు హాజ‌రు ప‌రచ‌నున్నారు.

అయితే విచార‌ణ‌కు జానీ మ‌స్ట‌ర్ స‌హ‌క‌రిస్తున్నాడా? లేదా? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది. మ‌రోవైపు జానీ మాస్ట‌ర్ భార్య ఆరోప‌ణ‌లు నిజ‌మైతే జానీ మాస్ట‌ర్ వ‌దిలేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త‌ని చేయ‌ని త‌ప్పుకు బాధితుడిని చేస్తున్నార‌ని ప్ర‌త్యారోపించింది. నిన్న‌టి రోజున ఆమె నార్సింగ్ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది.

జానీ మాస్ట‌ర్ కేసు విష‌యం కోసం కాద‌ని...ఓ ఫేక్ ఫోన్ కాల్ రావ‌డంతో స్టేష‌న్ కి వెళ్లిన‌ట్లు మీడియాలో వైర‌ల్ అయింది. బాధితురాలిని జానీ మాస్ట‌ర్ ని పెళ్లి చేసుకోవాల‌ని మాస్ట‌ర్ భార్య బెదిరించింద‌ని బాధిత మ‌హిళ ఫిర్యాదులో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. జానీ మాస్ట‌ర్ వివాదంపై టాలీవుడ్ లో ఒక్కొక్క‌రుగా స్పందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న గురించి ఎవ‌రి అభిప్రాయాలు వారు పంచుకుంటున్నారు. దీనికి సంబంధించి టాలీవుడ్ ప‌రిష్కార క‌మిటీ కూడా బాధిత మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచింది. లైంగిక బాధితులు ఎవరైనా ఉంటే? వెంట‌నే త‌మ‌ని సంప్ర‌దించాల‌ని...అలాగే అన్ని శాఖ‌ల్లోనూ ఫిర్యాదు చేసేలా క‌మిటీలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించింది.

Tags:    

Similar News