పూజా హెగ్డే.. చీరలో దివాళి గ్లామర్

రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పూజా హెగ్డే పలు ఫోటోలను షేర్ చేయగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-10-24 15:17 GMT

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రతిసారి తన స్టైల్, గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పూజా హెగ్డే పలు ఫోటోలను షేర్ చేయగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “దివాలి సెషన్ ముందుగానే స్టార్ట్ అయ్యింది ఈ ఏడాది” అంటూ ఫోటోలకు క్యాప్షన్ జోడిస్తూ పూజా తన ఫ్యాన్స్‌కు ఫెస్టివ్ మూడ్‌ను ముందుగానే తెచ్చింది.


అందులో ఉన్న ట్రెడిషనల్ లుక్, ఆమె ధరించిన చీర, ఆభరణాలు అన్నీ కూడా మెరిసిపోతున్నాయి. ఆ ఫోటోలలో పూజా హెగ్డే ఎలిగెంట్ క్రీమ్ కలర్ చీరలో, ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మెరిసే జ్యూయెలరీ ధరించి, చాలా గ్లామరస్‌గా కనిపిస్తుంది. సింపుల్ అయినా, ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతూ పూజా తన గ్లామర్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది.


ఈ ఫోటోలు విడుదలైన తర్వాత నెట్టింట తెగ వైరల్ అవుతుండడంతో పూజా హెగ్డే దివాళీ సెలబ్రేషన్స్‌ నిజంగానే ముందుగా మొదలయ్యాయని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, పూజా హెగ్డే తన కెరీర్‌లో మరో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కొన్నాళ్లు సక్సెస్ కు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది.


ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి ఒక పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. అదే విధంగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్‌తో ‘దేవా’ అనే యాక్షన్ చిత్రంలో నటిస్తూ, సినిమాల షూటింగ్‌లలో బిజీగా గడుపుతున్నారు. ఇక, విజయ్ 69 ప్రాజెక్ట్‌లో కూడా పూజా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇతర సినీ తారల మాదిరిగా, పూజా కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

Tags:    

Similar News