పూజా.. ఇది మరీ టూమచ్ అబ్బా..!

తెలుగు నుంచి కచ్చితంగా ఆఫర్స్ వస్తాయని ఇన్నాళ్లు ఎదురుచూసిన పూజాకి ఇక్కడ ఆఫర్లు కష్టమే అన్న మైండ్ సెట్ కి వచ్చింది.

Update: 2024-07-03 08:30 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ పై బెట్టు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాం కొనసాగించిన అమ్మడు ఒక్కసారిగా సినిమాలు లేక డీలా పడిపోయింది. స్టార్ హీరోలంతా కాదు కాదు స్టార్ డైరెక్టర్స్ అంతా అదేదో ఆమె మీద పగ పట్టినట్టుగా ఆమెను ఎంపిక చేయట్లేదు. మొన్నటిదాకా ఆహా ఓహో అన్న వాళ్లు కాస్త ఇప్పుడు ఆమె కాకుండా వేరే ఆప్షన్ కి వెళ్తున్నారు. తెలుగు నుంచి కచ్చితంగా ఆఫర్స్ వస్తాయని ఇన్నాళ్లు ఎదురుచూసిన పూజాకి ఇక్కడ ఆఫర్లు కష్టమే అన్న మైండ్ సెట్ కి వచ్చింది.

ఈ క్రమంలో తన దాకా వచ్చిన స్పెషల్ సాంగ్ ఆఫర్ ని కాదన్నదని టాక్. రాక రాక వచ్చిన అవకాశం కాస్త అమ్మడు నో నాట్ ఓకే అనేసరికి అది కూడా వెళ్లిపోయింది. రాధే శ్యాం తర్వాత పూజా టాలీవుడ్ ఫేట్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా ఆ సినిమా తర్వాత పూజా ని అందుకోవడం కష్టమని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ సినిమా తర్వాత అమ్మడికి సరైన ఛాన్సులు రాకుండా పోయాయి.

మహేష్ గుంటూరు కారం సినిమాలో అమ్మడు చేయాల్సి ఉన్నా సినిమాకు ఇచ్చిన డేట్స్ లో పూర్తి చేయలేకపోయారు. ఇంకా ఎక్కువ డేట్స్ అడిగితే వేరే సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత పూజా పేరు కూడా టాలీవుడ్ లో వినిపించలేదు. అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అని అనుకుంటే ఆ సినిమానే పక్కన పెట్టేశారు.

Read more!

నాగ చైతన్య కార్తీక్ దండు కాంబో సినిమాలో పూజా పేరు వినిపిస్తుంది. ఒకవేళ ఆ ఛాన్స్ కూడా మిస్ అయితే మాత్రం అమ్మడిని తెలుగు ఆడియన్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. మొన్నటిదాకా తన థై షోతో యూత్ ఆడియన్స్ ని అలరించిన పూజా హెగ్దే ఇప్పుడు ఎంత రెచ్చిపోదామని అనుకుంటున్నా ఆఫర్లు మాత్రం రావట్లేదు. ఐతే టాలీవుడ్ ఛాన్స్ ఇవ్వకపోయినా తమిళ్ లో సూర్య హీరోగా ఒక ప్రాజెక్ట్ ఓకే చేసింది పూజా హెగ్దే. ఆ సినిమాతో అయినా అమ్మడు మళ్లీ సౌత్ లో ఫాం లోకి వస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News

eac