త్రివిక్రమ్ పై పూనమ్ మరో ట్వీట్.. అలా పెట్టిందేంటి?

ఇప్పుడు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

Update: 2024-09-17 13:40 GMT

హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఆమె.. తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. వివిధ విషయాల్లో స్పందిస్తూ ఉంటోంది. సామాజిక అంశాలపై తనదైన శైలిలో పోస్టులు పెడుతుంటోంది. అప్పుడప్పుడు సంచలన ట్వీట్స్ చేస్తుంటోంది. సినిమాలు చేయకపోయినా.. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

అయితే టాలీవుడ్‌ లో ప్ర‌స్తుతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన పూనమ్.. జానీని మాస్ట‌ర్ అని పిల‌వ‌కండని ట్వీట్ చేసింది. అలా పిల‌వాలంటే క‌నీసం గౌర‌వం ఉండాలంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత సంచలన ట్వీట్ పెట్టింది. ఇప్పటికే డైరెక్టర్ త్రివిక్రమ్ పై అనేక ఆరోపణలు చేసిన పూనమ్.. ఇప్పుడు మరోసారి ట్వీట్ చేసింది. కొన్నిసార్లు ఇన్ డైరెక్ట్ కామెంట్లు చేసినా.. ఇప్పుడు పేరు కూడా మెన్షన్ చేసింది.

"త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పై ఇప్పటికే మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాను. కానీ నాతోపాటు చాలామందికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవచ్చు. దీంతో నా ఫిర్యాదును తిరస్కరించారు. ఆ తర్వాత నేను పెద్దలకు కూడా ఫిర్యాదు చేశాను. ఇప్పుడైనా త్రివిక్రమ్‌ ను ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం పూనమ్ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.

రీసెంట్ గా ఏపీలో జరిగిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సీక్రెట్ కెమెరాల విషయంలో స్పందించి.. ట్వీట్ లో త్రివిక్రమ్ పేరును ప్రస్తావించింది పూనమ్. త్రివిక్రమ్ తో ఉన్న వివాదాన్ని ఆయనకు సంబంధం లేని విషయంలో అప్పుడు రాజేసింది. అమ్మాయిలకు సలహాలు ఇస్తూ.. ఓ కామెంట్ కు త్రివిక్రమ్ ను నిజం చెప్పమని అడగండని రిప్లై చేసింది. ఇంతకుముందు కూడా పలుమార్లు పూనమ్.. పవన్ కళ్యాణ్ తోపాటు త్రివిక్రమ్ పై అనేక ఆరోపణలు చేసింది.

అయితే త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఏంటో తనకు తెలుసు అని ఓసారి ఆరోపించింది. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్‌ చేస్తారని తనకు తెలుసని చెప్పింది. తాను అనుభవంతో మాట్లాడుతున్నానని తెలిపింది. త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో అడగండని అనింది. తాజాగా ఆయనపై ఫిర్యాదు ఇచ్చానని తెలిపింది. జానీ మాస్టర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన టైమ్ లో పూనమ్.. త్రివిక్రమ్ ను పేరు తీసుకురావడం మరో హాట్ టాపిక్ అవుతోంది.

Tags:    

Similar News