త్రివిక్రమ్ పై మళ్లీ పూనమ్ అలా..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన హిడెన్ కెమెరా వివాదంపై నెట్టింట పూనమ్ స్పందించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-01 15:20 GMT

నటి పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన అమ్మడు.. కొన్నాళ్లుగా మూవీస్ కు పూర్తిగా దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు సంచలన ట్వీట్స్ చేస్తూ వైరల్ అవుతుంటోంది. సమాజంలోని పలు విషయాలపై స్పందిస్తుంటోంది. సినిమాల్లో కనిపించకపోయినా.. డైలీ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన హిడెన్ కెమెరా వివాదంపై నెట్టింట పూనమ్ స్పందించిన విషయం తెలిసిందే. అక్కడి అమ్మాయిలకు మద్దతుగా ట్వీట్ చేసింది. "ప్రియమైన అమ్మాయిలారా.. బయట మీకు జరుగుతున్న అవమానాలు చూసి బాధపడుతున్నాను. ఇటీవల జరిగిన ఘటన చాలా దారుణం. విద్యార్థి సంఘాలు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుంది" అని తెలిపింది.

వ్యక్తులు ఎంత శక్తివంతులైనా, వారిపై కఠిన చర్యలు తీసుకునేవరకు అస్సలు ఊరుకోవద్దని తెలిపింది. రెజ్లర్ల నిరసనను గుర్తు చేస్తున్నట్లు చెప్పింది. తమ కోసమే కాకుండా, ఇతర విద్యార్థుల కోసం పోరాడుతున్నారంటూ కొనియాడింది. దీంతో ఆమె పోస్ట్ ను ట్యాగ్ చేసి ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఒక కుమార్తె, మహిళ అయ్యి ఉండి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఎన్నో ఆరోపణలు పూనమ్ చేసిందని ఆరోపించారు.

ఇప్పుడు అమ్మాయిలు ఏం చేయాలో చెబుతుందని, ముందు ఆమె కరెక్ట్ గా ఉండాలని ట్వీట్ చేశారు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ను నిజం చెప్పమని అడగండని పూనమ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోసారి త్రివిక్రమ్ తో ఉన్న వివాదాన్ని ఆయనకు సంబంధం లేని విషయంలో రాజేసింది. ఇంతకుముందు కూడా అనేక సార్లు పూనమ్.. పవన్ కళ్యాణ్ తోపాటు త్రివిక్రమ్ పై ప్రత్యక్ష, పరోక్ష వ్యాఖ్యలు చేసింది.

అయితే అస్సలు త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ కు ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు. వారి మధ్య ఏం జరిగిందో కూడా తెలియదని అంటున్నారు. కానీ ప్రతీ సారి టార్గెట్ చేసి పోస్టులు పెడుతుందని కామెంట్లు పెడుతున్నారు. ఆ మధ్య... పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ విషయంలో త్రివిక్రమ్, పూనమ్ మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని పూనమే తెలిపింది. మరేం జరిగిందో ఆమెకే తెలియాలి.

Tags:    

Similar News