మాస్ థియేటర్ లో సలార్ మేనియా షురూ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్- సీజ్ ఫైర్. ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది

Update: 2023-12-19 14:55 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్- సీజ్ ఫైర్. ఈ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీన విడుదల కానుంది. అయితే నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో తొలి టికెట్ ను అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కొనుగోలు చేసినట్లు ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. 'భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి ఫస్ట్‌ టికెట్‌ను కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. నైజాంలో ఈ సినిమాకు గ్రాండ్‌ ఓపెనింగ్స్‌ లభిస్తాయన్న నమ్మకం ఉంది' అని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ పేర్కొంది.

అయితే నైజాంలో మైత్రీ సంస్థ.. సింగిల్ స్క్రీన్ల టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయలేదు. నేరుగా థియేటర్లలోని కౌంటర్ల వద్ద టికెట్లను అమ్మనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడిదే నిజమైంది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద భారీగా చేరుకున్నారు. రోడ్ల వెంబడి లైన్లలో నిల్చుని తమ అభిమాన హీరో సినిమా టికెట్లను కొనేందుకు వెయిట్ చేస్తున్నారు.

థియేటర్ వద్ద అభిమానులు బారులు తీరిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఆ ఫొటోలు, వీడియోను రీషేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ మైత్రీ సంస్థపై ఫైర్ అవుతున్నారు. 21వ శతాబ్దంలో తొలిరోజు టికెట్ల కౌంటర్లలో అమ్మడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మండిపడుతున్నారు.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు జోరుగా ప్రీబుకింగ్స్ సాగుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ రూపొందించిన ఈ చిత్రంలో శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News