బిగ్ బాస్ 8 : తప్పని ప్రూవ్ చేస్తే హౌస్ నుంచి వెళ్లిపోతా..!

అతన్ని కాపాడేందుకు ఓజీ క్లాన్ మెంబర్స్ అదే ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ కు చెందిన మెంబర్స్ ప్రయత్నించారు.

Update: 2024-10-18 04:10 GMT

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం జరుగుతున్న మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ టాస్క్ లో గురువారం ఎపిసోడ్ లో నానా రచ్చ జరిగింది. మణికంఠ వాష్ రూమ్ కి వెళ్లిన టైం లో అతన్ని ఓవర్ స్మార్ట్ ఫోన్స్ సభ్యులు అదే రాయల్ క్లాన్ మెంబర్స్ ఎటాక్ చేశారు. అతన్ని కాపాడేందుకు ఓజీ క్లాన్ మెంబర్స్ అదే ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ కు చెందిన మెంబర్స్ ప్రయత్నించారు. ఈ తోపులాటలో గౌతం నిఖిల్ మధ్య వాదన జరిగింది. ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా పోట్లాడుకున్నారు.

వాష్ రూమ్ ఏరియా మొత్తం వీరి ఫైట్ వల్ల అంతా చెల్లా చెదురు అయ్యింది. బలాబలాలు చూపించాలని అనుకున్న ఈ ఇద్దరు ఒకరి మీద మరొకరు గొడవ పడుతూ కనిపించారు. గౌతం అయితే తను కావాలని చేయలేదని మదర్ ప్రామిస్ అన్నాడు. తనది తప్పని ప్రూవ్ చేస్తే హౌస్ లోంచి వెళ్లిపోతా అని అన్నాడు. నిఖిల్ వర్షన్ చూస్తే తప్పంతా గౌతం దే అన్నట్టు ఉంది.

ఫిజికల్ టాస్క్ లో ఒకరి మీద ఒకరు ఇలా వాదనలు వినిపించడం కామనే. ఐతే ఈ టాస్క్ లో కొందరు తెలివిగా ఆడుతుంటే కొందరు ఫిజికల్ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో మెగా చీఫ్ కంటెండర్ షిప్ లో భాగంగా హౌస్ మెట్స్ అంతా కూడా తమ ఆటతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఇదే టాస్క్ లో పృధ్వి, మణికంఠల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన మాటా మాటా పెరిగి హౌస్ అంతటిని ఒక దగ్గరికి చేరేలా చేసింది.

పృధ్వి ని నువ్వు నా ఈకతో సమానం అంటూ మణికంఠ అనడం మిగతా హౌస్ మెట్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆదివారం తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. ఐతే లీస్ట్ లో హరితేజ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆమె అవుతుందా లేదా గౌతం, తేజాలలో ఒకరు అవుతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News