సీక్రెట్ గా `పుష్ప‌-2` స‌న్నివేశాలా? ఇదేంది!

సినిమా అంటే షూటింగ్ అంటే వంద‌లాంది మంది ప‌ని చేస్తున్నారు.

Update: 2024-10-02 14:30 GMT

సినిమా అంటే షూటింగ్ అంటే వంద‌లాంది మంది ప‌ని చేస్తున్నారు. సెట్స్ లో బోలెడంత హ‌డావుడి ఉంటుంది. షూటింగ్ మొదలైన నాటి నుంచి ప్యాక‌ప్ చెప్పే వ‌ర‌కూ నిరంత‌రం సెట్ అంతా బిజీ బిజీగా ఉంటుంది. ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు, కార్మికులు ఇలా అంతా ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉంటారు. అందులోనూ భారీ కాన్సాస్ పై తెర‌కెక్కించే సినిమా అయితే మ‌రింత బిజీగా ఉంటుంది.

మ‌రింత మంది అద‌నంగా ఉంటారు.

కానీ `పుష్ప‌-2` క్లైమాక్స్ సీక్రెట్ చిత్రీక‌రించారు? అన్న‌ది ఎంత మందికి తెలుసు. ఎలాంటి హ‌డావుడి లేకుండా కామ్ గా కానిచ్చేసి వ‌చ్చారు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. ఇటీవల ఈ చిత్రంలోని పతాక సన్నివేశాల చిత్రీకరణ అత్యంత గోప్యంగా జరిగిందని సమాచారం. చిత్ర యూనిట్ లోని అతి కొద్దిమందితో ఈ చిత్రీకరణ చేశారట. సినిమాలో కీలకంగా భావించే ఈ సన్నివేశాలు విడుదల వరకు బయటికి లీక్ అవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే సుకుమార్ ఇంత గొప్య‌త పాటించిన‌ట్లు స‌మాచారం.

కేవ‌లం కొంత మంది టెక్నీషియ‌న్లు, కీల‌క న‌టుల స‌మ‌క్షంలో సుకుమార్ వీటిని చిత్రీక‌రిం చిన‌ట్లు తెలుస్తోంది. వాళ్లంతా కూడా సుకుమార్ కి ఎంతో న‌మ్మ‌క‌స్తులు అట‌. ఈ స‌న్నివేశాలు కాకినాడ స‌హా హైద‌రాబాద్ లో చిత్రీక‌రించిన‌ట్లు స‌మాచారం. సినిమాకి లీకుడ‌ల బెద‌ద చాలా కాలంగా ఉన్న‌దే. సెట్స్ నుంచే స‌న్నివేశాలు లీక్ అవ్వ‌డం..అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వడం తెలిసిందే. సెట్స్ లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నా? లీకులు ఏదో రూపంలో జ‌రుగుతూనే ఉన్నాయి.

దీంతో సుకుమార్ ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. `గేమ్ ఛేంజ‌ర్` షూటింగ్ విషయంలో కూడా నిర్మాత దిల్ రాజు స్ట్రిక్ట్ రూల్స్ అనుస‌రించిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, హీరోలు తప్ప ఇంకెవ్వ‌రూ సెట్స్ కి ఫోన్లు తీసుకురాకూడ‌ద‌ని షూట్ ప్రారంభంలోనే కండీష‌న్ పెట్టి షూటింగ్ చేసారు.

Tags:    

Similar News