ఐఫాలో రాశీ ఇలా ఎమోష‌న్ అయిందేమిటీ?

ఐఫా ఉత్స‌వాల సమ‌యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాశీ చెప్పిన కొన్ని విష‌యాలు ఆద్యంతం అందినీ ఆలోచింప‌జేసాయి.

Update: 2024-09-29 13:00 GMT

ఐఫా- 2024 వేడుక‌లు రెండు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా సాగాయి. ఈ ఉత్స‌వాల్లో స్టారాధి స్టార్లు మెరిసారు. అందులో రాశీ ఖ‌న్నా ఒక‌రు. రాశీ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల‌లో న‌టిస్తున్నారు. ఐఫా ఉత్స‌వాల సమ‌యంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాశీ చెప్పిన కొన్ని విష‌యాలు ఆద్యంతం అందినీ ఆలోచింప‌జేసాయి. రాశీ ఏం చెప్పారంటే?

*ఎవ‌రైనా నటి మంచిగా ఉండటం ఒక్క‌టే సరిపోదు... కష్టపడి పనిచేయడం విజయానికి కీలకం. ఏ రంగంలో ఉన్నా, నిచ్చెనను అధిరోహించడానికి మీరు మీ బెస్ట్ అందించాలి. ఏ మెట్టు ఎక్కాలి? ఎన్ని మెట్లు ఎక్కాలి? అనే ఒత్తిడికి లోనుకాకుండా కష్టపడి క్రమశిక్షణతో మెలగాలి.

*కళ అనేది పోటీ కాదు.. ఇది ఒక సహకారం. నేను ఎల్లప్పుడూ చేయగలిగినంత ఉత్తమంగా చేయడంపై దృష్టి సారిస్తాను.. ఇత‌రులు కూడా అలాగే ఉంటారు. మీరు మీ బెస్ట్ ఇవ్వ‌డంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు.. మీరు ఎల్లప్పుడూ ఇత‌రుల‌తో కలిసి మెరుస్తూ ఉంటారు.

*ఏదైనా పరిశ్రమలో ఎదుగుద‌ల‌ను మీ ఎంపికలు నిర్ణయిస్తాయి. ఒకరి పరిధి , బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి అవకాశం లేని పాత్రలలో నటించడం సరైంది కాదు. అయితే ఈరోజు తమ ఎంపికలలో ధైర్యంగా ఉండే .. భిన్నమైన పాత్రలు పోషించడానికి వేచి ఉన్న మహిళా నటులకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి..అని రాశీ తెలిపారు. రాశీ త‌దుప‌రి విక్రాంత్ మాస్సేతో కలిసి `ది సబర్మతి రిపోర్ట్`లో క‌నిపించ‌నుంది. నవంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇది ఇన్ఫోటైన్ మెంట్... నిజంగా ఏమి జరిగిందనే వాస్తవ సంఘటనలను చూపిస్తున్నారు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో క‌లిసి `ఫర్జీ` రెండవ సీజన్‌లోను రాశి న‌టిస్తోంది.

Tags:    

Similar News