సలార్ నైజాం గోల.. దిల్ రాజు ఏం చేస్తాడో?

కానీ మేకర్స్ అందుకు నో చెప్పారు. దిల్ రాజు తక్కువ రేట్ కి సలార్ రైట్స్ ని అడగడంతో అతనికి ఇవ్వకుండా రూ.65 కోట్లకు సలార్ నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ కి ఇచ్చారు.

Update: 2023-12-13 14:50 GMT

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'సలార్' డిసెంబర్ 22న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నైజాం లో సలార్ ని రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు సపోర్ట్ చేస్తాడా? లేదా? ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న ప్రశ్న ఇదే. దిల్ రాజు ఇటీవల సలార్ నైజాం రైట్స్ ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు.

కానీ మేకర్స్ అందుకు నో చెప్పారు. దిల్ రాజు తక్కువ రేట్ కి సలార్ రైట్స్ ని అడగడంతో అతనికి ఇవ్వకుండా రూ.65 కోట్లకు సలార్ నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ కి ఇచ్చారు అని ఒక ప్రచారం ఉంది. ఎలాంటి పెద్ద సినిమా కైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే అందుకు మొదటివారం చాలా కీలకం. కాబట్టి ఓవైపు టికెట్ ధరలు పెంచడంతో పాటుగా అదనపు షోలతో సినిమాను విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది.దానికి తోడు అన్నిచోట్ల ఎక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయాలి.

అందుకే ఇప్పుడు నైజాంలో దిల్ రాజు సలార్ మూవీని రికార్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు అతని సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేస్తాడా ? లేదా అనే సందేహం ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రభుత్వం నుంచి టికెట్ పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నైజాంలో సినిమా భారీ బిజినెస్ జరుపుకోవడంతో అంతే భారీ స్థాయిలో స్క్రీన్స్ కూడా రావాల్సి ఉంటుంది. నైజాంలో దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ మధ్య మూవీ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయ్ అనే ప్రచారం ఉన్నందున ఇది కాస్త ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలా ఉంటే దిల్ రాజు వల్లనే మైత్రి మూవీ మేకర్స్ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించిందని చాలామంది ఇండ్రస్ట్రీ జనాలు భావిస్తున్నారు అని కూడా ఒక టాక్ ఉంది . దిల్ రాజు ఇప్పటికే నైజాంలో యానిమల్, హాయ్ నాన్న సినిమాలను విడుదల చేయగా అవి ఇప్పటికీ అక్కడ బాగానే నడుస్తున్నాయి. అలాగే షారుక్ ఖాన్ 'డంకీ' ని కూడా దిల్ రాజే నైజంలో విడుదల చేస్తాడనే టాక్ కూడా ఉంది. సలార్ రిలీజ్ టైం లో దిల్ రాజు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.

కాబట్టి సలార్ కోసం దిల్ రాజు నైజాం లో ఎన్ని స్క్రీన్స్ ఇస్తాడో చూడాలి. మరోవైపు హాలీవుడ్ మూవీ 'ఆక్వా మ్యాన్' సలార్ కి మరో తలనొప్పిగా మారింది. ఈ మూవీ కూడా అదే సమయంలో పలు స్క్రీన్స్ లో విడుదలవుతోంది. వీటన్నిటిని బట్టి సలార్ కి తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో థియేటర్స్ దొరకడం చాలా కష్టంగా కనిపిస్తోంది అని ఒక టాక్ నడుస్తుంది . మరి ఈ సిచువేషన్ ని మైత్రి మూవీ మేకర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. రీసెంట్ గా ఆదిపురుష్ తో మైత్రి నిర్మాతలు నైజంలో రూ.10 కోట్లు కోల్పోయారు. దాంతో సలార్ సక్సెస్ వీళ్ళకి చాలా కీలకంగా మారింది.

Tags:    

Similar News