సలార్ టీమ్ బయటకు!

అయితే సినిమా విడుదలకు ఇంకా వారమే ఉన్నా.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ సహా మేకర్స్ ఎవరూ ఎక్కడా కనిపించడం లేదు.

Update: 2023-12-15 05:58 GMT

ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత యాక్షన్ రోల్ లో ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమా విడుదలకు ఇంకా వారమే ఉన్నా.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ సహా మేకర్స్ ఎవరూ ఎక్కడా కనిపించడం లేదు. మొన్న సూరీడే గొడుగు పట్టి అంటూ స్నేహనికి సంబంధించిన సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పటి వరకు ఎలాంటి సందడి చేయలేదు. మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. ఫ్యాన్స్ తో చిట్ చాట్ కూడా చేయడం లేదు. కేవలం తెలుగులోనే కాదు ఏ భాషలోనూ ప్రమోషన్లను మేకర్స్ నిర్వహించడం లేదు.

దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా.. ప్రమోషన్లు బాగా జరిగితేనే బెటర్ అని అంటున్నారు. సినిమా కంటెంట్ లో కాస్త తేడా కొట్టినా.. ప్రమోషన్లు గట్టిగా అయితే థియేటర్లకు జనం వెళ్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫైనల్ గా వీటిన్నంటిని బేస్ చేసుకుని డైరెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారట.

త్వరలోనే తన చిత్రబృందంతో తెలుగు మీడియా ముందుకు రానున్నారట ప్రశాంత్ నీల్. రెండు రోజుల్లో గ్రూప్ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారట. ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సహా పలువురి నటులతో కలిసి టాలీవుడ్ జర్నలిస్ట్ లతో సినిమా విషయాలను పంచుకోనున్నారట. ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను రిలీజ్ చేయనున్నారట. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

కేజీఎఫ్, కాంతార వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్ సలార్ మూవీని నిర్మించింది. సినిమాలో ప్రభాస్‌తో పాటు శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, శరణ్ శక్తి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు వసూలు చేయడం పక్కా అని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు.

Tags:    

Similar News