'స్పిరిట్' అప్డేట్.. సందీప్ వంగా ఏం చెప్పారంటే?

సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన 'పొట్టేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Update: 2024-10-22 05:52 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో "స్పిరిట్" ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక కాప్ డ్రామా అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు తాజాగా ఈ సినిమా కథాంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.

సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన 'పొట్టేల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'స్పిరిట్' సినిమా గురించి ఎవరికీ తెలియని విషయం ఏమైనా రాయమని యాంకర్ సుమ కు ఒక పలక అందించగా.. దీనిపై "పోలీస్ స్టోరీ" అని రాశాడు సందీప్. ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే అయినప్పటికీ, ప్రభాస్ బర్త్ డేకి ముందు దర్శకుడు ఈ కథ గురించి చెప్పడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు సందీప్ వంగా. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో పాన్ ఇండియాని షేక్ చేయడానికి ప్రభాస్ తో చేతులు కలుపుతున్నారు. డార్లింగ్ తన తన కెరీర్ లోనే తొలిసారిగా డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ క్యారక్టర్ ప్లే చేస్తున్నాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసి, లాఠీ చేత పట్టుకొని.. కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతాడని అభిమానులు భావిస్తున్నారు.

సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోల క్యారక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆయన తన హీరోలను బెస్ట్ లుక్ లో ప్రజెంట్ చేస్తుంటారు. ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ ను సైతం సరికొత్త లుక్ లో, చాలా స్టైలిష్ గా చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ పోలీస్ స్టోరీని తన గత చిత్రాల కంటే ఇంకాస్త ఎక్కువ వైలెంట్ గా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2024 చివర్లో ప్రారంభిస్తామని సందీప్ చెప్పారు. కానీ పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఏడాదే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

"స్పిరిట్" చిత్రాన్ని టీ-సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చనున్నారు. భారతీయ భాషలతో పాటుగా మాండరిన్, జపనీస్, కొరియన్ వంటి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News