కుమార్తె డేటింగ్‌పై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన సీనియ‌ర్ న‌టి

ఈ పుకార్లపై శ్వేతా తివారీ స్పందించారు. పాపుల‌ర్ మీడియాతో మాట్లాడుతూ శ్వేతా ఇలా చెప్పారు. ''పాలక్ ప్రస్తుతం బలంగా ఉంది.. కానీ రేపు కొన్ని వ్యాఖ్యలు లేదా కథనాలు త‌న‌ విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు.

Update: 2024-08-12 03:48 GMT

బాలీవుడ్ లో వ‌రుస‌గా న‌ట‌వార‌సురాళ్లు త‌మ ల‌క్ ని ప‌రీక్షించుకుంటున్నారు. క‌థానాయిక‌లుగా ఆరంగేట్రం చేస్తూ వారి ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇటీవ‌ల శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీక‌పూర్, షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్ క‌థానాయిక‌లుగా త‌మ ల‌క్ చెక్ చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇంత‌లోనే సీనియ‌ర్ న‌టి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ తన తల్లి అడుగుజాడల్లో క్రమంగా వినోద పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది. హార్డీ సంధుతో కలిసి హిట్ మ్యూజిక్ వీడియో 'బిజ్లీ బిజ్లీ'లో కనిపించడంతో ఈ కుర్ర‌బ్యూటీ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. మొద‌టి ఆల్బ‌మ్ వేగంగా వైరల్ అయింది. గత సంవత్సరం సల్మాన్ ఖాన్ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'లో పాల‌క్ సహాయక పాత్రలో కనిపించింది. ఇటీవల అమృతా సింగ్ -సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో పాలక్ రిలేషన్ షిప్ గురించి బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, తరచూ లంచ్, డిన్నర్ డేట్‌ల‌కు వెళుతున్నార‌ని క‌థ‌నాలు వేస్తున్నాయి.

ఈ పుకార్లపై శ్వేతా తివారీ స్పందించారు. పాపుల‌ర్ మీడియాతో మాట్లాడుతూ శ్వేతా ఇలా చెప్పారు. ''పాలక్ ప్రస్తుతం బలంగా ఉంది.. కానీ రేపు కొన్ని వ్యాఖ్యలు లేదా కథనాలు త‌న‌ విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. త‌ను ఇంకా చిన్నపిల్ల. కొన్ని సమయాల్లో ఈ ప్ర‌చారం చాలా క్రూరంగా ఉంటోంది. త‌న క‌థానాయ‌కులంద‌రితోను సంబంధంలో ఉంద‌నే ప్ర‌చారం భ‌విష్య‌త్ లో జ‌రుగుతుంది. వీటన్నింటిని ఆమె ఎంతకాలం సహిస్తుందో కూడా నాకు తెలియదు. తన డేటింగ్ రూమర్స్ గురించి పాల‌క్ కూడా ఆశ్చర్యపోయింది. త‌ను ఈ ప్ర‌చారాన్ని ఎగతాళి చేస్తుంది. కానీ కొన్నిసార్లు ప‌రిస్థితులు ఆమెను ఇబ్బంది పెట్టవచ్చు'' అని వ్యాఖ్యానించింది.

పాలక్ తన స్లిమ్ ఫిగర్ గురించి ఎదుర్కొన్న విమర్శలపైనా శ్వేత వ్యాఖ్యానించింది. ''ఇది ఆమె(పాల‌క్‌)ను బాధించదు. ఆమెకు మొదట్లో అలా అనిపించేది.. కానీ ఇప్పుడు చాలా మంది తనలా కనిపించే ఆమెలా కనిపించాలనుకునే వారు చాలా మంది ఉన్నారని త‌న‌కు తెలుసు. చాలా కష్టపడి ఈ రూపాన్ని సాధించిందని ఆమెకు తెలుసు'' అని శ్వేతా అన్నారు.

2022 నుంచి పాల‌క్- ఇబ్ర‌హీం జంట‌పై పుకార్లు ఉన్నాయి. ఈ జోడీ క‌లిసి ఫోటోగ్రాఫ‌ర్ల‌కు ఫోజులివ్వ‌డంతో ఇది మొద‌లైంది. గతంలో పాలక్ -ఇబ్రహీం ముంబై మహాలక్ష్మి రేస్ కోర్స్‌లో అమెరికన్ రాపర్ పోస్ట్ మలోన్ కచేరీకి హాజరైన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అలాగే ఇబ్ర‌హీం కొత్త కార్ కొన్న‌ప్పుడు అత‌డి ఇంటి వ‌ద్ద మొద‌టి వ్య‌క్తిగా క‌నిపించి పాల‌క్ హైలైట్ అయింది. ఇన్ని ఘ‌ట‌న‌ల త‌రవాత సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో పాల‌క్ తాము కేవలం మంచి స్నేహితులం అని స్పష్టం చేశారు. ఇక ఇబ్ర‌హీంతో త‌న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత త‌న త‌ల్లికి సారీ చెప్పాన‌ని కూడా పాల‌క్ అంది.

వృత్తిపరంగా పాలక్ తివారీ సిద్ధాంత్ కుమార్ సచ్‌దేవ్ త‌దుప‌రి చిత్రం 'ది వర్జిన్ ట్రీ'లో నటించనుంది. ఇందులో సన్నీ సింగ్, మౌని రాయ్‌లతో స్క్రీన్‌ను షేర్ చేసుకోనుంది.

Tags:    

Similar News