శింబు కథ సూపర్ స్టార్ దగ్గరకు..

కూలీ సినిమా పూర్తి కాకముందే సూపర్ స్టార్ మరో సినిమాను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది.

Update: 2024-09-24 05:12 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. ప్రస్తుతం రజినీ నటించిన వేటయ్యన్ రిలీజ్ కు రెడీ అయ్యింది. అక్టోబర్ 10న వేటయ్యన్ రిలీజ్ అవుతుండగా ఆ సినిమాతో పాటే కూలీ సినిమా కూడా లైన్ లో ఉంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమా విషయంలో అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కూలీ సినిమా పూర్తి కాకముందే సూపర్ స్టార్ మరో సినిమాను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది.

మలయాళంలో 2018 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ జూడ్ ఆంతోని జోసెఫ్ డైరెక్షన్ లో రజినీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కథా చర్చలు ముగియగా త్వరలోనే సినిమాకు సంబందించిన అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో తెరకెక్కించబోతున్నారు. కేరళ ఫ్లడ్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన 2018 సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

ఆ సినిమా తర్వాత ఆ డైరెక్టర్ ఓ కథ రాసుకుని ముందు హీరో శింబుకి వినిపించారట. మరి ఆయన ఏమన్నాడో కానీ అదే కథను రజినీ దగ్గరకు తీసుకెళ్లి ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట. వేటయ్యన్, కూలీ వరుస క్రేజీ సినిమాలతో వస్తున్న రజినీ తన ఫ్యాన్స్ కి మస్త్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. వేటయ్యన్ సినిమాను కోలీవుడ్ మొత్తం కలిసి ప్రమోట్ చేస్తుంది. అందుకే పోటీగా వద్దామనుకున్న కంగువ కూడా రిలీజ్ వాయిదా వేసుకున్నారు.

కూలీ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వచ్చే ఛాన్స్ ఉండగా ఈలోగా కొత్త సినిమా మొదలు పెట్టి దాన్ని 2025 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రజిని మాస్ స్టామినా ఏంటన్నది రాబోతున్న సినిమాలతో మరోసారి ప్రూవ్ కానుంది. రజనీకాంత్ వేటయ్యన్ సినిమాలో రానా, అమితాబ్, ఫాహద్ ఫాజిల్ నటించగా.. కూలీలో నాగార్జున నటిస్తున్నారు. మరి రాబోతున్న సినిమాలో కూడా వేరే స్టార్స్ ఎవరైనా భాగం అవుతారా లేదా అన్నది చూడాలి. రజినీ స్కెచ్ ఏంటో తెలియట్లేదు కానీ ఫ్యాన్స్ కు మాత్రం మంచి జోష్ ఇచ్చేలా సినిమాలు చేస్తున్నాడు.

Tags:    

Similar News