ఓదెల విలేజ్ లో తమన్నా.. ఎంతో ప్రశాంతంగా!

ఓదెల 2.. టాలీవుడ్‌ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్స్ లో ఒకటన్న విషయం తెలిసిందే.

Update: 2024-10-08 16:16 GMT

ఓదెల 2.. టాలీవుడ్‌ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్స్ లో ఒకటన్న విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీడ్ రోల్ పోషిస్తున్న ఆ హైలీ యాంటిసిపేటరీ సీక్వెల్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్ హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌ కు సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ నంది టీమ్‌ వర్క్‌, మధు క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే ఈ మూవీపై ఆడియన్స్ లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, బిహైండ్ ద సీన్స్ గ్లింప్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయిన షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. తాజాగా మేకర్స్ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఓదెల గ్రామంలో చిత్రీకరణ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్ షెడ్యూల్ తో తమన్నా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన పిక్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సినిమాలో శివశక్తి (నాగ సాధు), ఓదెల సద్గుణ రక్షకురాలు పాత్రలో కనిపించనున్న తమన్నా.. షూటింగ్ కు రెడీ అవుతున్న ఫోటోతో పాటు ఒక స్టిల్ ను రిలీజ్ చేశారు. లొకేషన్‌ లో ఆమె మేకప్‌ వేసుకుంటున్న స్టిల్‌ తోపాటు శివశక్తిగా మారిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వర్కింగ్ స్టిల్‌లో తమన్నా చాలా రిలాక్స్డ్ గా కనిపించారు. ఆమె ముఖంలో ప్రశాంతత క్లియర్ గా కనిపిస్తుంది. అయితే తమన్నా మొదటి సారి ఓదెల విలేజ్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు.

దీంతో మేకర్స్.. చివరి షెడ్యూల్‌ ను రూపొందించడానికి సహకరిస్తున్న ఓదెల గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఫైనల్ షెడ్యూల్ లో ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. తమన్నాతో పాటు మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులపై చిత్రీకరణ చేస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్‌ ను త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టనున్నారు.

అనంతరం థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయిదే ఓదెల-2లో వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ కూడా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాంతార చిత్రానికి గూస్‌ బంప్స్ తెప్పించే మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చి మెప్పించిన అజనీష్‌ లోక్‌ నాథ్‌.. ఓదెల-2కు వర్క్ చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌ రాజన్ డీవోపీగా, రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మరి ఈ మూవీ.. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News