అందుకే పిలిచారు.. ఈడీ విచారణపై నవదీప్ వివరణ

నవదీప్ సినిమాల విషయానికొస్తే.. ఆయన సమర్పణలో తెరకెక్కిన సగిలేటి కథ సినిమా తాజాగా రిలీజ్​ అయింది

Update: 2023-10-12 11:56 GMT

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పేరు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నార్కోటిక్స్​ పోలీసులుతో పాటు ఈడీ విచారణకు హాజరవుతూ దర్యాప్తుకు సహకరిస్తున్నారు. సాధారణంగా నవదీప్​ పేరు ఈ కేసులో హాట్​టాపిక్​గా మారడంతో ఆయన బయటకనపడకుండా ఉంటారని, అజ్ఞాతంలోకి వెళ్లిపోతారేమోనని అంతా అనుకున్నారు.

కానీ ఆయన అందరి అంచనాలను తలకిందుకు చేస్తూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎక్కడా దేనీకి తడబడకుండా స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. మీడియా ముందుకు కూడా వస్తున్నారు. తాజాగా ఓ ఫిల్మ్​ ప్రీమియర్ షోకు హాజరై సందడి చేశారు. అక్కడ కూడా మీడియాలో ఇంటరాక్ట్​ అయ్యారు. ఈడీ దర్యాప్తుకు గురించి కూడా మాట్లాడారు.

"ఈడీ నన్ను రొటీన్​ ఇన్వెస్టిగేషన్​ భాగంలోనే పిలిచింది. వారికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటిని నేను దర్యాప్తుగా క్లారిఫై చేశాను" అని పేర్కొన్నారు. అలానే 'మరోసారి వెళ్లాల్సి ఉంటదా' అని జర్నలిస్టులు అడగగా.. 'ప్రస్తుతానికైతే దాని గురించి తెలీదు. ఇప్పటికైతే నేను వారు అడిగిన దానికి స్పష్టత ఇచ్చాను. వారు ఏం అడిగారో దాని గురించి చెప్పాను. ఎటువంటి ఆందోళన లేదు' అని నవదీప్ చెప్పారు. ఈ డ్రగ్స్​ కేసులో టాలీవుడ్​కు చెందిన ఇతర వ్యక్తులు విచారణ ఎదుర్కోవడం, అరెస్ట్​లు అవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోతుంటే, కానీ నవదీప్ మాత్రం స్వేచ్ఛగా తిరగడం, కూల్​గా సమాధానాలు చెప్పడం ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది.

కాగా, రీసెంట్​గా తెలంగాణ నార్కోటిక్ పోలీసులు నవదీప్​ను విచారించగా.. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా డ్రగ్స్ కేసులో ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా? అనే కోణంలో విచారించారు. ఈ విచారణలో మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లతో నవదీప్​కు ఉన్న సంబంధాలు, వారి మధ్య జరిగిన లావాదేవీలు, నవదీప్ ఫోన్ కాల్ డాటా, మేసేజ్​లను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది.

నవదీప్ సినిమాల విషయానికొస్తే.. ఆయన సమర్పణలో తెరకెక్కిన సగిలేటి కథ సినిమా తాజాగా రిలీజ్​ అయింది. ఆయన నటించిన లవ్​ మౌలి త్వరలోనే రిలీజ్ కానుంది.

Tags:    

Similar News