OTT: ఆ మూడు సినిమాలు ఒకేసారి..

ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకే రోజు ఓటీటీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి.

Update: 2024-09-08 04:59 GMT

గత నెల తెలుగులో రిలీజ్ అయిన మూడు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి ఓటీటీలో కూడా పెద్దగా ప్రేక్షకాదరణ రావడం లేదు. ఇదిలా ఉంటే నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ని అందుకుంది.

తరువాత ఆగష్టు 15న రిలీజ్ అయిన నార్నె నితిన్ ఆయ్ మూవీ కూడా సైలెంట్ హిట్ అయ్యింది. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు కమర్షియల్ మంచి లాభాలని నిర్మాతలకి తీసుకొచ్చాయి. అలాగే గత నెల మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఊహించని స్థాయిలో మొదటి ఆట నుంచే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా భారీ నష్టాలని మిగిల్చింది. ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకే రోజు ఓటీటీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. సెప్టెంబర్ 12న ఆయ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఇక అదే రోజు కమిటీ కుర్రోళ్ళు మూవీ ఈటీవీ విన్ లో ఓటీటీ ఆడియన్స్ ముందుకి వస్తోంది. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు సినిమాల కోసం ఓటీటీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కచ్చితంగా ఈ రెండు చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తాయని భావిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి ఉంటుంది. కమిటీ కుర్రోళ్ళు సినిమా వరల్డ్ వైడ్ గా 18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అయ్ సినిమాకి 15 కోట్ల వరకు కలెక్షన్స్ ఇప్పటి వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆయ్ మూవీ సక్సెస్ తో జోరు మీద ఉన్న బన్నీ వాస్ నాగ చైతన్యతో చేస్తోన్న తండేల్ సినిమాపై దృష్టి పెట్టారు. డిసెంబర్ 20న పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీపైన అంచనాలు పెరిగాయి. మరో వైపు నిహారిక కొణెదల నిర్మాతగా బిగ్ స్క్రీన్ పై మొదటి సినిమాతో సక్సెస్ అందుకోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన దృష్టి పెట్టింది. ఆమె నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News