పిక్ టాక్ : దీపావళికి ఇంతకి మించి స్పెషల్‌ ఉండదేమో!

Update: 2023-11-12 09:13 GMT

దీపావళి సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎన్నో పోస్టర్స్ మరియు వీడియోలు వచ్చాయి. కానీ ఈ ఫోటోలు మాత్రం చాలా స్పెషల్ గా నిలుస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఫోటోలను అందరు హీరోల ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు. హీరోలు వెంకటేష్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లు ఈ దీపావళి సందర్భంగా కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి సర్‌ ప్రైజ్ చేశారు.

సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మెగా వారి ఇంట దీపావళి సెలబ్రేషన్ నిర్వహించారు. ఆ వేడుకలో ఈ స్టార్స్ అంతా కూడా పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. హీరోలు మాత్రమే కాకుండా వారి భార్యలు కూడా ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలను చూస్తే అర్థం అవుతోంది.

నమ్రత, ఉపాసన, లక్ష్మీ ప్రణతి, స్నేహా రెడ్డి లతో పాటు మరికొందరు టాలీవుడ్‌ కి చెందిన లేడీ సెలబ్రిటీలు కూడా మెగా వారి దీపావళి పండుగ సందర్భంగా హడావుడి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి దీపావళికి ఇంతకు మించిన ప్రత్యేకమైన ఫోటో ఉండదేమో అన్నట్లుగా నలుగురు హీరోల ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

ఈ ఫోటోలు దీపావళి ని మరింత కాంతివంతంగా మార్చాయి అంటూ ఆయా హీరోల ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఇలాంటి ఫోటోలను తాము ఆశిస్తున్నామని, ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ హీరోలు చాలా స్నేహంగా మెలుగుతూ మంచి వాతావరణం క్రియేట్‌ చేస్తున్నారు అంటూ ఆయా హీరోల ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News