పుష్ప2: అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆమె వద్దకే

సినిమాలో పాటలు అన్ని కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి.

Update: 2024-09-09 15:01 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లలో ఒకటిగా పుష్ప 2 ఉంది. దీనికి కారణంగా పుష్ప సినిమాకి వచ్చిన సక్సెస్ అని చెప్పొచ్చు. పుష్ప మూవీలో సాంగ్స్ కి గాను దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ అవార్డు అందుకున్నారు. సినిమాలో పాటలు అన్ని కూడా సెన్సేషనల్ హిట్ అయ్యాయి. రికార్డ్ స్థాయిలో వ్యూవ్స్ సొంతం చేసుకున్నాయి.


ఈ పాటలలో మరీ ముఖ్యంగా సమంత చేసిన ఊ అంటావా సాంగ్ అయితే ట్రెండ్ సెట్ చేసింది. అన్ని భాషలలో కూడా ఈ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. మరల అదే స్థాయిలో స్పెషల్ సాంగ్ ని పుష్ప 2 కోసం కూడా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ పాట చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. దీనికి కారణం సాంగ్ కోసం కావాల్సిన యాక్టర్ ఇంకా ఖరారు కాకపోవడమే అని తెలుస్తోంది. ఈ పాటకి యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రిని తీసుకోవాలని ముందుగా అనుకున్నారు.

అయితే ఎందుకనో హోల్డ్ లో పెట్టారు. మరల శ్రీలీలతో పాటు మరికొంత మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు. వారిలో కొంతమందిని సంప్రదించడం జరిగిందంట. మళ్ళీ ఏమైందో ఏమో ముందు అనుకున్న త్రిప్తి డిమ్రి దగ్గరకి సుకుమార్ టీమ్ వచ్చి ఆగారంట. ఈమెతో ఫైనల్ డిస్కషన్ జరుగుతోందంట. మేగ్జిమమ్ త్రిప్తిని ఖరారు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. త్వరలో దీనిపై అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావొచ్చని భావిస్తున్నారు.

యానిమల్ సినిమాతో త్రిప్తి కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో త్రిప్తి కనిపించింది తక్కువ సమయమే అయిన కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్ర చేసింది. దీంతో ఆమెకి ఒక్కసారిగా విశేషమైన పాపులారిటీ వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో బిజియస్ట్ యాక్టర్ గా మారిపోయింది. ఇప్పుడు పుష్ప 2లో ఐటెం సాంగ్ కన్ఫర్మ్ అయితే టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ లభించే అవకాశం దొరికినట్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. పుష్ప 2 నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. థర్డ్ సింగిల్ గా ఐటెం సాంగ్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట.

Tags:    

Similar News