1000 ఎక‌రాల్లో UP ఫిల్మ్ సిటీ.. పోటీలో బ‌డా బాబులు!

ఇప్పుడు జూమ్ క‌థ‌నం ప్రకారం.. పరిశ్రమలోని అనుభవజ్ఞులైన చిత్రనిర్మాతలలో ఒకరైన KC బొకాడియా ఈ హైప్రొఫైల్ బిడ్ చుట్టూ ఉన్న తాజా పరిణామాలను రివీల్ చేసారు.

Update: 2024-01-09 04:44 GMT

యమునా ఎక్స్‌ప్రెస్‌వే రీజియన్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చర్చ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం అక్షయ్ కుమార్, దినేష్ విజన్, బోనీ కపూర్, భూషణ్ కుమార్, కెసి బొకాడియా వంటి ప్రముఖులతోపాటు ప‌లువురు బాలీవుడ్ దిగ్గ‌జాలు బిడ్డింగ్ వార్‌లో పాల్గొన్నార‌ని తెలిసింది. జనవరి 5తో ముగిసిన బిడ్ లో యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) ఈ ప్రముఖ వ్యక్తుల నుండి బిడ్‌లను స్వీకరించినట్లు అధికారికంగా ధృవీకరించింది.

ఇప్పుడు జూమ్ క‌థ‌నం ప్రకారం.. పరిశ్రమలోని అనుభవజ్ఞులైన చిత్రనిర్మాతలలో ఒకరైన KC బొకాడియా ఈ హైప్రొఫైల్ బిడ్ చుట్టూ ఉన్న తాజా పరిణామాలను రివీల్ చేసారు. వేలం ప్రక్రియలో తన భాగస్వామ్యాన్ని బొకాడియా ధృవీకరించారు. ఇది ఆసక్తికరమైన సవాలుతో కూడుకున్న బిడ్ అని, ఎవరు గెలుస్తారో చూద్దాం అని ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. యమునా అథారిటీ ప్రాంతంలోని సెక్టార్ 21లో 230 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ చిత్ర పరిశ్రమ ప్రముఖుల దృష్టిని విప‌రీతంగా ఆకర్షించింది. నాలుగు బిడ్‌లు (అక్షయ్ కుమార్ - దినేష్ విజన్ సంయుక్తంగా, బోనీ కపూర్, భూషణ్ కుమార్ - KC బొకాడియా సంయుక్తంగా) బిడ్ లు సమర్పించారు. ప్రస్తుతం సాంకేతిక పరీక్ష సాగుతోంది. నిబంధనల ప్రకారం ఆర్థిక బిడ్‌లు ఓపెన‌వుతాయి. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం బిడ్ సమర్పణల గడువు జనవరి 5 మధ్యాహ్నం 3:00 గంటలకు ముగిసింది. అథారిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సాంకేతిక బిడ్‌లను నిశితంగా పరిశీలించారు.

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ స్థాపన కోసం బిడ్డింగ్ ప్రక్రియ 30 సెప్టెంబరు 2023న ప్రారంభ‌మైంది. నాటి నుండి UP ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్ గురించి తీవ్ర‌మైన చ‌ర్చ సాగింది. అథారిటీలోని సెక్టార్ 21లో 1000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ ఒక స్మారక చారిత్ర‌క ప్రాజెక్ట్ కానుంది. మొదటి దశ 230 ఎకరాల్లో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేయడానికి అంకితం చేస్తారు. ఇది వినోద పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తోంది.

Tags:    

Similar News