మొన్న పెళ్లి...నేడు క్యాన్సిలా?

కానీ తాజాగా అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే కంగు తినాల్సిందే. ఆ రేంజ్ ఇచ్చింది అమ్మ‌డు ట్విస్ట్.

Update: 2024-10-05 10:34 GMT

మూడు నాలుగు రోజుల క్రిత‌మే న‌టి వ‌నితా విజ‌య్ కుమార్ నాల్గ‌వ పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌న‌సిచ్చిన కొరియోగ్రాఫ‌ర్ రాబ‌ర్ట్ తో ఏడు అడుగులు వేస్తున్న‌ట్లు తెలిపింది. దీంతో అమె అభిమానులంతా అడ్వాన్స్ గా విషెస్ కూడా తెలియ‌జేసారు. లెక్క ప్ర‌కారం ఈరోజు పెళ్లి జ‌ర‌గాలి. ఇద్ద‌రు క‌ళ్యాణ మండ‌పంలో ఉండాలి. భాజా భ‌జంత్రీల హ‌డావుడి క‌నిపించాలి.

కానీ తాజాగా అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే కంగు తినాల్సిందే. ఆ రేంజ్ ఇచ్చింది అమ్మ‌డు ట్విస్ట్. పెళ్లి లేదు గిల్లీ లేదు. ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ షార్ ఇచ్చింది. `మిసెస్ అండ్ మిస్ట‌ర్` సినిమా కోసం ఆ జోడీ ఈ ర‌క‌మైన ప్ర‌చారానికి తెర తీసారు. ఇందులో వనితా విజ‌య్ కుమార్ -రాబ‌ర్ట్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకి వ‌నిత‌నే ద‌ర్శ‌కురాలు. ఆమె కుమార్తె జోవిక నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఆ ర‌కంగా ట్విస్ట్ ఇచ్చి నేడు ఇలా సినిమాని హైలైట్ చేసారు. వ‌నిత పెళ్లి ట్విస్ట్ ఏంటి? అని అంతా క్లిక్ చేసి మ‌రీ చ‌దివేస్తున్నారు. కానీ అస‌లు సంగ‌తి లోప‌లికి వెళ్తే తెలుస్తోంది. ఇప్ప‌టికే వనితా విజ‌య్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకోవ‌డంతోనే ఇంత‌టి ఆస‌క్తి నెల‌కొంది

ఆ మ‌ధ్య న‌రేష్‌-ప‌విత్ర కూడా ఇలాగే హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించుకున్నారు కాబ‌ట్టి పెళ్లి చేసుకుంటున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం పోస్ట్ చేసారు. కానీ ఆ త‌ర్వాతే తెలిసింది. అందంతా సినిమా స్టంట్ అని. మ‌ళ్లీ పెళ్లి అనే సినిమా కోసం ఇద్ద‌రు అప్పుడు అలా హైలైట్ అయ్యారు.

Tags:    

Similar News