12 మంది హీరోయిన్స్ తో లింక్స్ - విశాల్

మొదటిసారి ఒక అమ్మాయి జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్ గా క్లారిటీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

Update: 2023-09-15 03:59 GMT

కోలీవుడ్ స్టార్ విశాల్ ప్రస్తుతం మార్క్ అంటోనీ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పీరియాడికల్ సైన్స్ ఫిక్షన్, మాఫియా నేపథ్యంలో ఉండబోతోంది. కామెడీ టచ్ తో మూవీని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ప్రేక్షకులకి అందిస్తున్నారు. విశాల్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో డ్యుయల్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విశాల్ ఓ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ఇండస్ట్రీలో తరుచుగా తన పెళ్లి గురించి మీడియా ఛానల్స్, వెబ్ సైట్స్ వార్తలు రాస్తున్నాయని, ఇప్పటి వరకు తనకి 12 మందితో పెళ్లి చేశారని విశాల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే తాను ఎప్పుడూ ఈ విషయాలపై రియాక్ట్ కాలేదని, మొదటిసారి ఒక అమ్మాయి జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని రీసెంట్ గా క్లారిటీ ఇవ్వడం జరిగిందని అన్నారు. 19 ఏళ్ళ నుంచి తనకి సంబందించిన ఏ న్యూస్ పేపర్ లో వచ్చిన కట్ చేసి దాచుకోవడం నాన్నకి అలవాటు.

అలాగే రీసెంట్ గా వచ్చిన లక్ష్మి మీనన్ తో పెళ్లి న్యూస్ కూడా అతను చెబితేనే నాకు తెలిసిందే. ఆమె భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఖండించాల్సి వచ్చింది. మీడియా వాళ్ళు నాకు 12 సార్లు ఇప్పటికే పెళ్లి చేసేశారు. వాటిలో ఏది వాస్తవం కాదు హీరోయిన్స్ లో చాలా మంది నాకు స్నేహితులు ఉన్నారు. పబ్, పార్టీలకి వెళ్దామని అడిగితే నేనే వద్దని చెబుతాను. అలా వెళ్లి మీడియాకి దొరికితే ఇంకా మళ్ళీ కొత్త స్టోరీస్ స్టార్ట్ చేస్తారు.

అందుకే వారినే ఇంటికి రామ్మంటాను. అక్కడ హ్యాపీగా భోజనం చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటాం అంటూ విశాల్ చెప్పుకొచ్చారు. అలాగే టాలీవుడ్ హీరోలైన నితిన్, నాని, రానాతో తనకి మంచి ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని విశాల్ చెప్పుకొచ్చారు. పెళ్లి చేసుకోవాల్సి వచ్చినపుడు కచ్చితంగా అందరికి చెప్పి చేసుకుంటానని, ఇందులో దాయడానికి ఏమీ లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు.

మొత్తానికి తన పెళ్లి చుట్టూ మీడియా అల్లిన కథలకి విశాల్ ఓ ఇంటర్వ్యూలో ఫుల్ స్టాప్ పెట్టేశారు. మార్క్ అంటోనీ సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాపై విశాల్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీంతో సూపర్ హిట్ కొడతానని అనుకుంటున్నారు. మరి ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.

Tags:    

Similar News