విశ్వంభర.. అన్నీ అనుకున్న సమయానికే..

చిరు చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ జోనర్ లో సినిమా చేస్తుండడంతో విశ్వంభర మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Update: 2024-07-04 07:07 GMT

టాలీవుడ్ లో దాదాపు 40 దశాబ్దాలుగా తనదైన మార్కు చూపిస్తూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.


చిరు చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ జోనర్ లో సినిమా చేస్తుండడంతో విశ్వంభర మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీంతో సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా వశిష్ట చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ ను వివిధ షెడ్యూళ్ల రూపంలో జరుపుతున్నారు. మూవీలో ఎక్కువగా గ్రాఫిక్స్ ఉండటం వల్ల స్పెషల్ సెట్స్ వేసి మరీ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తైనట్లు టాక్.


తాజాగా విశ్వంభర మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. డబ్బింగ్ పనులు మొదలుపెట్టామని అనౌన్స్ చేశారు. పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఫోటోలు కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మంచి అప్డేట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నారు ఫ్యాన్స్. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2025 జనవరి 10న సినిమా విడుదల కానుంది.

Read more!

దీంతో షెడ్యూల్ ప్రకారమే. విశ్వంభర సినిమాకు సంబంధించిన అన్ని పనులు జరుగుతున్నాయి. మూవీలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ ఎక్స్ ఉండడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అందుకే మేకర్స్ ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇలా అయితే మూవీ అనుకున్న డేట్ కు ఈజీగా రిలీజ్ చేయవచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ఇక ఈ సినిమాలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నారు. సీనియర్ బ్యూటీ త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్‌ లు అదిరిపోయేలా ఉండనున్నాయని టాక్. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News

eac