యోగ డే స్పెషల్‌... ముద్దుగుమ్మల షాకింగ్ ఆసనాలు

సోషల్‌ మీడియాలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అందాల ముద్దుగుమ్మలు ఆసనాలు వేసి మరీ యోగా డే జరుపుకున్నారు.

Update: 2024-06-21 06:49 GMT

2014 సెప్టెంబర్‌ 27న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ను ప్రతి సంవత్సరం జూన్‌ 21న జరిపేందుకు ప్రదిపాధించడం, అన్ని దేశాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. 2015 నుంచి యోగా డే జరుపుకుంటున్నాం.


ఇండియాలో యోగ డే భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా అందాల ముద్దుగుమ్మలు ఆసనాలు వేసి మరీ యోగా డే జరుపుకున్నారు. యోగా ఎంతటి అవసరమో తెలియజేయడం కోసం ముద్దుగుమ్మలు చాలానే కష్టపడ్డారు.


బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్ కి చెందిన ముద్దుగుమ్మలు, ఇతర రంగాలకు చెందిన అందగత్తెలు ఎంతో మంది యోగా ఆసనాలు వేసి ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట ముద్దుగుమ్మల యోగా ఆసనాలు వైరల్‌ అవుతున్నాయి.


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ తన సోదరుడితో కలిసి యోగాసనాలు వేసింది. ఆ ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. నికితా దత్తా యోగా ఆసనాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ కూడా యోగా ఆసనాలతో ఆకట్టుకుంది.

ఇంకా చాలా మంది హీరోయిన్స్‌, మోడల్స్ ఇంకా సోషల్‌ మీడియా సెలబ్రిటీలు యోగా ఆసనాలు వేయడం ద్వారా యోగా డే ను స్పెషల్ గా మార్చారు. ఇలాంటి వారు యోగాసనాలు వేయడం ద్వారా కచ్చితంగా యోగా కి మంచి స్పందన వస్తుందని, ఆసక్తి లేని వారు కూడా యోగా చేయాలని అనుకుంటారేమో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News