టీడీపీ మహిళా నేత ఆడియో లీక్... తెరపైకి సంచలన విషయాలు!

ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంబంధించిన ఆడియో సంచలనంగా మారింది.

Update: 2024-04-08 13:37 GMT

ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి సంబంధించిన ఆడియో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా జిల్లాలో పలువురు టీడీపీ నేతల పరిస్థితి బాగాలేదన్నట్లుగా ఆమె చేసిన వ్యాఖ్యలు, తనకు వ్యక్తిగతంగా ఇప్పటికీ వైసీపీ అంటే ఇష్టం అన్నట్లుగా మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

అవును... నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆడియో సంచలనంగా మారింది! కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఫోన్ చేసిన ఆమె ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు! ఇందులో భాగంగా... పలువురు టీడీపీ నాయకులను కించపరుస్థున్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు!

కాగా... నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి, రాజేంద్రనాథ్‌ రెడ్డిని విడగొట్టేందుకు పలు మార్లు రాజేంద్రనాథ్‌ కు ఆమె పలుమార్లు కాల్‌ చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రసన్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ ను టీడీపీలో చేరాలని ఆమె సూచించారన్ని అంటున్నారు. ఇదే సమయంలో... తనను కోవూరు నుంచి పోటీచేయాలంటూ టీడీపీ నేతలు వెంటపడుతున్నారని ఆమె చెప్పడం ఈ ఆడియోలో వినిపిస్తుంది!

ఇదే సమయంలో ఆత్మకూరులో మేకపాటి విక్రమ్‌ బాగా పనిచేసుకుంటున్నారని ఆమె తెలిపారు! ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఆడియోను రాజేంద్రనాథ్ రెడ్డి బయటపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తన మద్దతు కోసం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్‌ చేశారని తెలిపారు. నల్లపురెడ్డి కుటంబంలో విభేదాలు తేవాలని చూస్తున్నారని.. ప్రసన్న కుమార్‌ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో.. ప్రశాంతి రెడ్డి రెడ్డికి తమ కుటుంబం పేరెత్తే అర్హత కూడా లేదని అన్నారు!

Full View
Tags:    

Similar News