బ్రేకింగ్... కోనేటి ఆదిమూలం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!

అవును... సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు తాజాగా ఓ సంచలన మెసేజ్ పెట్టారని సమాచారం.

Update: 2024-09-07 09:58 GMT

తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు.. తెలుగు మహిళా మండల అధ్యక్షురాలి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ సంచలన మెసేజ్ పెట్టారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... తాను చనిపోతున్నా అంటూ ఆమె మెసేజ్ పెట్టారని అంటున్నారు.

అవును... సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు తాజాగా ఓ సంచలన మెసేజ్ పెట్టారని సమాచారం. నిన్న రాత్రి 12 గంటల తర్వాత ప్రాంతంలో సత్యవేడు నియోజకవర్గ టీడీపీ గ్రూపుల్లో... "నాకు ఎవరూ సహకరించడం లేదు.. మీ తల్లి, చెల్లికి ఇలానే జరిగితే మీరు ఊరుకుంటారా.. అందుకే నేను చచ్చిపోతున్నా.. అందరికీ ఇక సెలవు!" అని ఆమె మెసేజ్ పెట్టారని తెలుస్తోంది.

దీంతో... ఈ విషయం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. మరోపక్క ఈ కేసు విషయంలో పోలీసులు ఆమె చెబుతున్న హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్ లు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెబుతున్నారు.

ఇదే సమయంలో... ఆమెను వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు, పోలీసులు కోరారని అంటున్నారు. అయితే... అందుకు ఆమె నిరాకరించారని తెలుస్తోంది. అయితే... ప్రధానంగా ఆమెకు సహకారం లభించలేదు సరికదా.. సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్స్ జరగడంతోనె తీవ్ర మనస్థాపం చెంది ఇలా సంచలన మెసేజ్ పెట్టారని అంటున్నారు.

ఇంకోపక్క... ఆరోగ్య సమస్యలతో ఆదిమూలం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని అంటున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని.. లోబీపీతో బాదపడుతున్నారని తెలుస్తొంది. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన తరుపు న్యాయవాదుపు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Tags:    

Similar News