నాగార్జున‌కు ప‌రువు ఉందా?: 'చికెన్' నారాయ‌ణ కామెంట్స్‌

దీనికి సంబంధించి నాగార్జున స్టేట్‌మెంటును నాంప‌ల్లి కోర్టు న‌మోదు చేసింది.

Update: 2024-10-12 16:51 GMT

అక్కినేని నాగార్జునపై సీపీఐ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌ముఖ కామ్రెడ్, 'చికెన్‌' నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``ప‌రువు ఉన్నోడు క‌దా.. నాకు ప‌రువు పోయింది.. నాకు ప‌రువు పోయింది.. అని ఏడు స్తాడు. నాగార్జున‌కు ప‌రువు ఉందా?`` అని ప్ర‌శ్నించారు. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీపై చేసిన తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆమెపై నాగార్జున ప‌రువు న‌ష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే.

దీనికి సంబంధించి నాగార్జున స్టేట్‌మెంటును నాంప‌ల్లి కోర్టు న‌మోదు చేసింది. త‌మ కుటుంబాన్ని రాజ‌కీ యాల్లోకి లాగార‌ని.. త‌మ పరువుకు భంగం క‌లిగించార‌ని నాగార్జున పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే 100 కోట్ల రూపాయ‌ల ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన చికెన్ నారాయ‌ణ‌.. నాగార్జున‌కు ప‌రువు ఎప్పుడో పోయింద‌న్నారు. ఆయ‌న బిగ్ బాస్ వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ప్పుడే.. ఆయ‌న పరువు పోయింద‌న్నారు. ఇప్పుడు ప‌రువు-పరువు అంటే ఎలా వ‌స్తుంద‌న్నారు.

పరువు ఉన్నోడు పరువు నష్టం దావా వేయాలని, బిగ్‌బాస్ షో చేయడం ద్వారా... నాగార్జున పరువు ఎప్పుడో పోగొట్టుకొన్నాడని త‌న‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసే హక్కు నటి సమంతకు మాత్రమే ఉంద‌ని నారాయ‌ణ తీర్పు చెప్పారు. ఆమె పరువు న‌ష్టం దావా వేస్తే.. త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు మ‌హిళా సంఘాలు కూడా వస్తాయ‌న్నారు. క‌మ్యూనిస్టులుగా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను తాము ఎలా స‌మ‌ర్థిస్తామ‌ని ప్ర‌శ్నించారు.

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు దారి త‌ప్పేస్తున్నార‌ని చెప్పారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న గురించి మాట్లా డుతూ.. ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకుని ఆయ‌న‌ను గెలిపించార‌ని.. కానీ, ఆ స్థాయిలో ఆయ‌న పాల‌న అందించ‌డం డౌటేన‌ని చెప్పారు. క‌మ్యూనిస్టు పోరాటాలు త‌గ్గిపోయాయ‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. మీడియా ప్ర‌భావం కూడా ఉంద‌ని చెప్పారు. ``మేం ఎక్క‌డ ఉద్య‌మాలు చేస్తున్నా.. అస‌లు క‌వ‌రేజీ ఉందా? మేం కూడా బూతులు తిట్టాల‌ని మీరు కోరుకుంటున్నారు`` అని త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు.

Tags:    

Similar News