శ్రద్ధావాకర్ మాదిరి బెంగళూరులో.. 30పైగా ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్ లో!

తాజాగా గార్డెన్ సిటీ బెంగళూరులోనూ అదే తరహాలో చోటు చేసుకున్న హత్య ఇప్పుడు సంచలనంగా మారింది.

Update: 2024-09-22 07:30 GMT

కొంతకాలం క్రితం ఢిల్లీలోని శ్రద్ధావాకర్ అత్యంత ఘోరంగా ముక్కలు ముక్కలుగా నరికేసి.. ఫ్రిడ్జ్ లో దాచేసిన ఉదంతం తెలిసిందే. తాజాగా గార్డెన్ సిటీ బెంగళూరులోనూ అదే తరహాలో చోటు చేసుకున్న హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉండే 29 ఏళ్ల ఒంటరి మహిళ దారుణంగా హత్యకు గురైంది. మరణించిన మహిళను మహలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆమె శరీరాన్ని ముప్ఫైకు పైగా ముక్కలుగా నరికేసి.. ఫ్రిడ్జ్ లో దాచేసిన వైనం షాకింగ్ గా మారింది.

బెంగళూరులోని వయాలికవావల్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘోర హత్యకు గురైన మహలక్ష్మికి గతంలోనే పెళ్లైంది. వ్యక్తిగత కారణాలతో ఆమె తన బిడ్డతో కలిసి మునేశ్వరనగర్ లో ఐదు నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె భర్త హుకుమ్ సింగ్ నేలమంగళలో నివసిస్తున్నాడు. బాధితురాలికి అప్పుడప్పుడు ఆమె తల్లి.. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో అనుమానం వచ్చిన వారు.. బెంగళూరుకు రాగా జరిగిన ధారుణం వెలుగు చూసింది.

పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందేమంటే.. హతురాలు కొద్ది రోజుల క్రితమే హత్యకు గురైనట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఫోన్ కాల్ డేటాను చూస్తే.. చివరి కాల్ సెప్టెంబరు 2న ఉండటంతో.. ఆమె ఆ రోజే హత్యకు గురై ఉంటారని భావిస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవటంతో వారు ఆమె ఇంటికి వచ్చారు. తలుపు వేసి ఉండటంతో.. డోర్లు బద్ధలు కొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే ఇల్లు దుర్వాసన వస్తుండటం.. ఫ్రిజ్ తెరిచి చూడగా.. ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

బాధితురాల్ని నిందితుడు అనేక ముక్కలుగా నరికి.. ఫ్రిజ్ లో పెట్టిన వైనాన్ని పోలీసులు వెల్లడించారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు కెమికల్స్ చల్లి.. ఇంటికి తాళం వేసి పరారైనట్లుగా భావిస్తున్నారు. ఫోరెన్సిక్ లేబలేటరీ టీం ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. మహలక్ష్మికి తెలిసిన ఇరుగుపొరుగు నుంచి కొంత సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. బాధితురాలు ఈ మధ్యనే తనకు స్నేహితురాలైందని.. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న విషయాన్ని ఒక మహిళ చెప్పారు. ఆమె అన్నయ్య ఆ ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నాడని.. ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుందని పేర్కొన్నారు.

ఐదు నెలల నుంచి ఆమె అక్కడే ఉంటుందని.. రోజూ ఉదయం ఐదున్నర గంటలకు బయటకు వెళ్లి రాత్రి పదిన్నరకు ఇంటికి వస్తుంటుందని స్థానికులరాలు మేరీ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని పేర్కొన్నారు. హతురాలి తల్లి.. సోదరి ఇంటికి వచ్చి.. ఇంటి లోపలకు వెళ్లిన తర్వాత కానీ.. ఆమె అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వైనం వెలుగు చూసింది.

Tags:    

Similar News