అబ్బాయిని ఎరవేసి రౌడీషీటర్ ని చంపేశారు... అతను గే?

హత్యలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో నలుగురు దొరకగా... మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Update: 2023-08-17 07:26 GMT

సాధారణంగా రౌడీ షీటర్ నో, శత్రువునో హత్య చేయడానికో చేయించడానికో అమ్మాయిలను ఎరగా వేస్తుంటారని ఎన్నో సీన్లు చాలా సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఒక మర్డర్ కేసులో... ఒక రౌడీషీటర్ కు అబ్బాయిని ఎరవేశారు. కారణం.. ఆ రౌడీ షీటర్ కు స్వలింగ సంపర్కం అలవాటు ఉండటమే!

అవును... అతడి స్వలింగ సంపర్కం అలవాటును ఆయుధంగా మలచుకొని సుపారీ ఇచ్చి మరీ ఒక రౌడీషీటర్‌ (27)ను హత్య చేశారు. ఈ మేరకు సైదాబాద్‌ లోని సౌత్‌ ఈస్ట్‌ డీసీపీ కార్యాలయంలో అదనపు సీపీ మనోహర్‌, చాంద్రాయణగుట్ట ఏసీపీ మనోజ్‌ కుమార్‌, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్‌ షకీర్‌ అలీతో కలిసి డీసీపీ సీహెచ్‌.రూపేష్‌ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

చాంద్రాయణగుట్ట బార్కస్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ సయీద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ బావజీర్‌ అలియాస్‌ సయీద్‌ బావజీర్‌ అవివాహితుడు. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లను లైంగికంగా వేధించినందుకు 3 పోక్సో కేసులతో కలిపి అతడిపై హైదరాబాద్‌, రాచకొండ పరిధిలో 11 పోలీసు కేసులున్నాయి. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులు ఇతడిపై రౌడీషీట్‌ తెరిచారు.

అనంతరం... చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తుండటంతో ఇతడిపై 2018లో పీడీయాక్ట్‌ ప్రయోగించారు. ఇదే సమయంలో సుల్తాన్‌ షాహికి చెందిన అహ్మద్‌ బిన్‌ హజీబ్‌ (20)పై హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో 6 కేసులున్నాయి. భవానీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో రౌడీషీట్‌ తెరిచారు.

ఈ క్రమంలో... 2021లో పోక్సో కేసులో సయీద్‌ బావజీర్‌ చంచల్‌ గూడ జైలులో ఉన్నపుడు అహ్మద్‌ బిన్‌ హజీబ్‌ పరిచయమయ్యాడు. బయటకొచ్చాక ఇద్దరికీ ఉన్న స్వలింగసంపర్కం అలవాటుతో మరింత దగ్గరయ్యారు. ఈ సమయంలో తన కోసం అతడి స్నేహితులను అసహజ శృంగారానికి ఒప్పించమంటూ హజీబ్‌ పై బావజీర్‌ ఒత్తిడి పెంచాడు.

దీంతో... దీన్ని భరించలేక మొగల్‌ పుర ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అయూఖాన్‌(20)ను తీసుకెళ్లాడు. అతడు తిరస్కరించినప్పుడు జరిగిన గొడవతో సయీద్‌ బావజీర్‌ లోగుట్టు తెలిసిందట. జల్‌ పల్లి పురపాలక పరిధిలో సమస్యలు, ప్రజాప్రతినిధులు, నేతలపై వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతుండేవాడు.

దీంతో... తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో తమను చులకన చేస్తున్నాడని జల్‌ పల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ అబ్దుల్లా సాది(30), అతడి తండ్రి అహ్మద్‌ సాది(60) ఇతడిపై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు హెచ్చరించినా మారకపోవడంతో అడ్డుతొలగించాలనే పథకం వేశారు. ఈ సమయంలో బావజీర్‌ స్వలింగ సంపర్కుడనే విషయం తెలియడంతో దాన్నే ఆయుధంగా హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు.

దీనికోసం బావజీర్ కు సన్నిహితుడైన హజీబ్‌ ను కలిసి దీనిపై గతనెలలో చర్చించారు. హత్యకు రూ.13 లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 6న తొలిసారి రౌడీషీటర్‌ హత్యకు సిద్ధమవగా అది బెడిసికొట్టింది. అనంతరం ఈనెల 9న హజీబ్‌ ఫోన్‌.. చేసి తాను ఒక యువకుడిని తీసుకొస్తున్నానని చెప్పాడు.

ఈ క్రమంలో 10న అర్ధరాత్రి సౌద్‌ అనే కుర్రాడిని తీసుకొని రెండు బైకులపై నలుగురు రౌడీషీటర్‌ కార్యాలయం వద్దకు చేరారు. ఈ సమయంలో ఇద్దరు బయట ఉండగా.. సౌద్‌, హజీబ్‌ లు ముందుగా సిద్ధం చేసుకున్న కత్తి, కారంపొడితో లోపలికి వెళ్లారు. ఈ సమయంలో సౌద్‌ ను గదిలోకి పంపి హజీబ్‌ బయటకు వచ్చాడు.

ఈ సమయంలో ఇద్దరూ అసహజ శృంగారంలో ఉండగా గదిలోకి ప్రవేశించిన హజీబ్‌.. బావజీర్‌ కళ్లల్లో కారం కొట్టి కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో బావజీర్ చనిపోయినట్టు నిర్ధారించుకున్నాక నలుగురు బైక్‌ లపై పారిపోయారు. హత్యలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో నలుగురు దొరకగా... మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News