పవన్ పై డి. మాధురి తీవ్ర వ్యాఖ్యలు... అటు ట్రోల్స్ - ఇటు ఫ్యాన్స్!

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై మాధురి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర హల్ చల్ చేస్తున్నాయి.

Update: 2024-10-11 07:23 GMT

దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ఇటీవల కలిసి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఇటీవల తిరుమలలో కనిపించిన వీరిద్దరూ.. తమ పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ లో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై మాధురి చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర హల్ చల్ చేస్తున్నాయి. ఈ కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

అవును... కోర్టు సమస్యలు అన్నీ సమసిపోతే త్వరలో అందరి సమక్షంలో వివాహం చేసుకుంటామని ప్రకటించిన దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా స్పందించిన శ్రీనివాస్... ఇలా ఒకరితో వివాహమై మరొకరితో కలిసి జీవించడం తప్పే కానీ.. తనకు తప్పదని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో స్పందించిన మాధురి.. పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత జీవితాలకూ, రాజకీయానికీ సంబంధం లేదని అన్నారు. తనపై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పిన మాధురి... ఈ రోజుల్లో ఎవరు పెర్ఫెక్ట్ గా ఉన్నారు..? ఎవరు కరెక్ట్ గా ఉన్నారు..? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పవన్ పేరు ప్రస్థావించారు.

ఇందులో భాగంగా... "ఇప్పుడున్న మన ప్రజెంట్ డిప్యూటీ సీఎంను కూడా రిజైన్ చేసేయ్యమనండి.. ముగ్గురు పెళ్లాలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా!.. ఎందుకీ కామెంట్స్?.. పొలిటికల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ నీ ఎందుకు కంపేర్ చేయాలి?" అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తనపై కామెంట్ చేసే పవన్ ఫ్యాన్స్.. ముందుగా వారి నాయకుడిని రాజీనామా చేయమని చెప్పి అప్పుడు కామెంట్స్ చేయాలని అన్నారు.

“పవన్ కల్యాణ్ కూడా ఒకామెకు విడాకులు ఇచ్చి, మరోకామెతో లివింగ్ టుగెదర్ లో ఉంటూ ఇంకోకామెను ప్రెగ్నెన్సీ చేసి... ఇన్ని చేసిన వ్యక్తిని డిప్యూటీ సీఎంగా ఎందుకు కూర్చోబెట్టారు..?” అని ఆమె ప్రశ్నించారు. “డిప్యూటీ సీఎం స్థాయిలో ఓ మంచి వ్యక్తికి కూర్చోబెట్టండి” అని సూచించారు. ఈ క్రమంలో కల్పించుకున్న శ్రీను... పవన్ ది తప్పుకాకపోతే తనది ఎలా తప్పవుతుందని అన్నారు.

మరోపక్క... ఈమె చేసిన కామెంట్స్ పై వైసీపీ శ్రేణుల నుంచి పవన్ పై ట్రోలింగ్స్ కూడా మొదలైపోయాయి. "బాగుంది... హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్లు.. నా మీద పడతారేంటి..?" అంటూ ట్రోలింగ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... పవన్ ఫ్యాన్స్ నిప్పులు కక్కుతున్నారు.

ఇందులో భాగంగా... వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ఆపాదించవద్దంటూ పవన్ ఫ్యాన్స్ మాధురికి సూచిస్తున్నారు. మీ వివాదాన్ని మీరు పరిష్కరించుకోకుండా పవన్ ప్రస్థావన ఎందుకు తెస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమెపై పవన్ పరువు నష్టం దావా వెయ్యాలని కోరుతున్నారు. ఏది ఏమైనా.. పవన్ పై మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట సరికొత్త రచ్చకు దారితీసాయనే చెప్పాలి!

Tags:    

Similar News