స్పెషల్ గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తున్న రాహుల్ గాంధీ!

ఒకప్పుడు రాహుల్ గాంధీ వేరు.. గత కొంతకాలంగా మారిన రాహుల్ వేరు అనే కామెంట్లు సొంతపార్టీ నుంచే కాదు ప్రత్యర్థుల నుంచి కూడా వినిపిస్తున్నాయని అంటున్న సంగతి తెలిసిందే

Update: 2024-09-15 06:14 GMT

ఒకప్పుడు రాహుల్ గాంధీ వేరు.. గత కొంతకాలంగా మారిన రాహుల్ వేరు అనే కామెంట్లు సొంతపార్టీ నుంచే కాదు ప్రత్యర్థుల నుంచి కూడా వినిపిస్తున్నాయని అంటున్న సంగతి తెలిసిందే. భారత్ జూడో యాత్ర సమయం నుంచి రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమైపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సెలూన్ నిర్వాహకుడికి స్పెషల్ గిఫ్ట్ పంపి సర్ ప్రైజ్ చేశారు.

అవును... రాయ్ బరేలీ జిల్లా లాల్ గంజ్ లోని బిజేంద్ర నగర్ మొహల్లాలో ఉన్న సెలూన్ నిర్వాహకుడు మిథున్ కి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేక బహుమతిని పంపించారు. ఇందులో భాగంగా సెలూన్ కి అవసరమైన వస్తువులను అందించారు. తాను ఆ సెలూన్ లో గడ్డం చేయించుకుంటున్నప్పుడు ఎదురైన పవర్ కట్ అనుభవాన్ని గుర్తు పెట్టుకుని ఇన్వెర్టర్ ను పంపించారు.

ఈ సందర్భంగా మిథున్ కు షాంపు కుర్చీ, రెండు హెయిర్ కటింగ్ ఛైర్స్, ఓ ఇన్వర్టర్ బ్యాటరీని పంపించారు. వాటిని స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు సదరు సెలూన్ నిర్వాహకుడికి అందజేశారు. గతంలో రాహుల్ తన సెలూన్ కి వచ్చినప్పుడు మధ్యలో పవర్ కట్ అయ్యిందని.. అది గుర్తుపెట్టుకుని మరీ రాహుల్, ఇన్వర్టర్ ను పంపించారని.. ఈ గిఫ్ట్ లు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మిథున్ తెలిపారు.

కాగా మే 13న బైశ్వారా ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి తిరిగివస్తుండగా.. మిథున్ షాప్ కి వెళ్లి గడ్డం కత్తిరించుకున్నారు! దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Full View
Tags:    

Similar News