విషాదం: సరదాగా వేసుకున్న ఉరి... సీరియస్ గా బిగుసుకుంది!

అవును... పిల్లల అల్లరిని మానిపించాలని ఓ తండ్రి చేసిన ప్రయత్నం తీవ్ర విషాదకరంగా మారింది.

Update: 2024-07-19 06:44 GMT

ఇంట్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు.. వారిని మందలిద్దామంటే వారి తల్లి అంగీకరించడం లేదు.. దీంతో పిల్లల అల్లరిని ఎలాగైనా మానిపించాలని ఓ తండ్రి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ప్రమాదవసాత్తు తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. దీంతో ఈ ప్రయత్నం విషాదకరంగా ముగిసింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

అవును... పిల్లల అల్లరిని మానిపించాలని ఓ తండ్రి చేసిన ప్రయత్నం తీవ్ర విషాదకరంగా మారింది. అల్లరి ఆపకపోతే చచ్చిపోతానంటూ ఓ తండ్రి పిల్లలను బెదిరించాడు. అయితే... పొరపాటున ఆ సమయంలో  వేసుకున్న ఉరి బిగుసుకుపోయింది. దీంతో... ఆ తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నంలోని గోపాలపట్నం పరిధిలో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... బీహార్ కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సుమారు ఐదేళ్లుగ విశాఖలోని గోపాలపట్నంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో... బుధవారం రాత్రి కుమార్తె (7), కుమారుడు (5) కలిసి ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు.

దీంతో.. అతడు పిల్లలపి చికాకు పడ్డారు. ఈ నేపథ్యంలో భార్య అతనికి అడ్డుపడింది. ఫలితంగా... భార్యభార్తల మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. దీంతో... తీవ్ర చికాకుపడిన చందన్ కుమార్... తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. అయినప్పటికీ ఎవరూ వినిపించుకోకపోవడంతో... ఇంట్లోని ఫ్యాన్ కు చీరకట్టి మెడకు బిగించుకున్నాడు.

అయితే ఇది కేవలం వారిని బెదిరించడానికి చేసిన ప్రయత్నంగానే చెబుతున్నారు. అయితే పొరపాటున ఆ ఉరికి బిగించిన చీర మెడకు బిగుసుకుపోయింది. ఆ సమయంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయతించినా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

Tags:    

Similar News