తెలుగుదేశంలోకి చేరిన తమ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు వైసీపీ మంగళ - బుధవారాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పార్టీ సభ్యులకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ విప్ ను ధిక్కరిస్తూ ఇటీవల పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలతో సహా జ్యోతుల నెహ్రూ - వరుపుల సుబ్బారావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి విధిగా హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. విప్ ను అందుకున్న ఎమ్మెల్యే, అసెంబ్లీకి హాజరై పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుంటే, వారిని ఎమ్మెల్యే పదవుల నుంచి తొలగించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి చేరిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు.
పార్టీని వీడిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ద్రవ్య వినిమయ బిల్లును వినియోగించుకోవాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే బిల్లుపై ఓటింగ్ ను జరిపించాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చిన ప్రతిపక్షం, తన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. గతవారంలోనే విప్ సమాచారాన్ని ఎమ్మెల్యేలకు పంపిన వైకాపా - మరోసారి వారికి పార్టీ నిర్ణయాన్ని గుర్తు చేసింది. ఓటింగులో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి విధిగా హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. అయితే ఇప్పటికే టీడీపీలో చేరిన 8 మంది, త్వరలో చేరనున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. దీంతో వైసీపీ నెక్స్టు స్టెప్ ఏమిటా అన్న ఆసక్తి నెలకొంది.
పార్టీని వీడిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ద్రవ్య వినిమయ బిల్లును వినియోగించుకోవాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే బిల్లుపై ఓటింగ్ ను జరిపించాలని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చిన ప్రతిపక్షం, తన ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. గతవారంలోనే విప్ సమాచారాన్ని ఎమ్మెల్యేలకు పంపిన వైకాపా - మరోసారి వారికి పార్టీ నిర్ణయాన్ని గుర్తు చేసింది. ఓటింగులో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించింది. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి విధిగా హాజరు కావాలని, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేకుంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించింది. అయితే ఇప్పటికే టీడీపీలో చేరిన 8 మంది, త్వరలో చేరనున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీకి డుమ్మా కొట్టేశారు. దీంతో వైసీపీ నెక్స్టు స్టెప్ ఏమిటా అన్న ఆసక్తి నెలకొంది.