కరోనాకు గుడి.. పూజలు.. వైరల్

Update: 2020-07-24 16:04 GMT
కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతూ అందరూ చనిపోతుంటే కొందరు ప్రబుద్దులు మాత్రం ఏకంగా కరోనాకు గుడి కట్టేశారు. వైరస్ ను దేవుడిలా పూజిస్తున్నారు.

ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ పట్టణంలో కరోనా మాత పేరుతో గుడి కట్టి పూజలు చేసిన సంగతి మరిచిపోకముందే తాజాగా కేరళలోనూ ఓ వ్యక్తి తన ఇంట్లో కరోనాకు గుడికట్టేశాడు.

కరోనా వైరస్ ను కాళీమాతకు ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తున్నాడు. మన దేశంలో ఎవరినైనా పూజించే హక్కు ఉందని.. మన చుట్టూ ఉండే గాలిలో దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు గాలి ఉన్న కరోనాను దేవుడిగా పూజించడంలో తప్పు లేదని కడక్కల్ పట్టణ వాసి అనిలన్ అంటున్నాడు.

తాజాగా కాళికదేవి మెడలో కరోనా ఆకారంతో తయారు చేసిన వస్తువును మాలగా వేసి అతడు పూజలు చేస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ వార్త కేరళలో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News