బండి సంజయ్ మీటింగ్ ఖర్చు అంతా మీడియా అధిపతులదే...?

Update: 2022-08-27 09:30 GMT
బీజేపీ తెలంగాణలో దూకుడు చేస్తోంది. బస్తీమే సవాల్ అంటోంది. ఇక దశల వారీగా బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ పాదయాత్రను చేపడుతూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ మీద పెద్ద ఎత్తున లేస్తూ బస్తీమే సవాల్ అంటున్నారు. గత రెండేళ్ళుగా చూస్తే బీజేపీ తాలూకా పొలిటికల్  యాక్టివిటీ బాగానే పెరిగింది. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున  సభలూ సమావేశాలూ నిర్వహిస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే బండి సంజయ్ పాదయాత్ర అతి పెద్ద ఆర్ధిక యాగంగానే చూడాలి. పాదయాత్రలో కలసి నడిచే వారికి భోజనాదులతో సహా అన్ని రకాలుగా చూసుకోవాలి. ఇక చిన్న చిన్న మీటింగ్స్ తో పాటు కూడళ్ళలో సమావేశాలు సభలు జరుగుతున్నాయి. ఎలా చూసుకున్నా బండి సంజయ్ పాదయాత్ర ఖర్చు తడిసి మోపెడు అవుతోంది.

బీజేపీ ఇప్పటిదాకా ఎన్నడూ  తెలంగాణాలో అధికారంలోకి రాలేదు సరికదా కనీసం రెండు పదుల సీట్లు కూడా లేవు. మరి బీజేపీకి ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ అవుతూంటే దాన్ని ఎలా వారు భరిస్తున్నారు అన్న చర్చ అయితే వస్తోంది. కాంగ్రెస్ తీరు అయితే చాలా సార్లు అధికారంలో ఉన్నా కూడా మంత్రులుగా చేసిన వారు సైతం ఖర్చుకు వెనకడుగు వేస్తారు. ఇక అన్ని రకాలుగా బలంగా ఉన్నారు కాబట్టే రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇచ్చారని కూడా అంటారు.

మరో వైపు అధికార పార్టీని తీసుకుంటే ఏకంగా ప్రభుత్వమే చేతిలో ఉంది కాబట్టి వారు ఎన్ని రకాలైన విన్యాసాలు అయినా చేయగలరు. మరి వారికి ధీటుగా బీజేపీ చేయాలీ అంటే ఆర్ధికంగా అతి పెద్ద కొండనే పక్కన పెట్టుకోవాలి. పైగా తెలంగాణాకు వచ్చే పోయే కేంద్ర పెద్దలు, వారి సభలు కూడా అదనపు ఖర్చుగానే చూడాలి. మరి ఇంత డబ్బు బీజేపీకి ఎక్కడ నుంచి వస్తోంది. కేంద్ర మంత్రులు, జాతీయ నేతల కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎంతో కొంత సాయం చేసినా బండి సంజయ్ పాదయాత్రకు నిధులు ఎలా సమకూరుతున్నాయి అన్నదే పెద్ద చర్చగా ఉంది.

అయితే దీనికి సమాధానంగా కొన్ని విషయాలు అయితే ప్రచారంలో ఉన్నాయని అంటున్నారు. అవేంటి అంటే ఇద్దరు బిగ్ షాట్స్ కలసి మీడియా అధిపతులుగా మారి ఇపుడు బీజేపీకి సానుకూలంగా ఉంటున్నారని తెలంగాణాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరూ అంటే ఇంతకు ముందు వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండేవారుట. అలాగే కన్స్ స్ట్రక్ష‌న్ రంగంలో కూడా అగ్రస్థానంలో ఉండేవారుట.

అయితే వారు అధికార టీయారెస్ కి దగ్గరగా ఉండడంతో వారి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టి మరీ కలవరం కలిగించాయని అంటున్నారు. ఒక వరసబెట్టి కీలక నేతల మీద జరుగుతున్న దాడుల నేపధ్యలో ఈ ఇద్దరూ ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తూ బీజేపీకి దగ్గర అయ్యారని అంటున్నారు. దాంతో ఈ ఇద్దరే ఇపుడు బండి సంజయ్ సభలకు యాత్రలకు అయ్యే ఖర్చుని భరిస్తున్నారు అని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.

మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ ఒక రాజకీయ  యాత్ర సాగాలీ అంటే దానికి తగిన ఇంధనం కూడా కావాలి. మరి అలాంటి ఇంధనం అన్నది సమకూర్చే వారు ఎపుడూ ఇలాగే తెరచాటునే ఉంటారు.సో అలా కనుక ఆలోచిస్తే ఆ ఇద్దరూ అలాగే భారాన్ని మోస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు అంటే వారే అని అంటున్నారు.
Tags:    

Similar News